పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి
• జాగ్రత్తలు పాటించాలి
• కార్యదర్శి చంద్రహాస్..
నిజాంపేట: నేటి ధాత్రి
పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి వహించాలని గ్రామ కార్యదర్శి చంద్రహాస్ అన్నారు. ఈ మేరకు మండలంలోని రాంపూర్ గ్రామంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం పై తనిఖీలు నిర్వహించారు. ఇంటి ఆరు బయట నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల దృశ్య ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి ఆరు బయట కలుపు మొక్కలు లేకుండా చూడాలన్నారు. గ్రామంలో వైద్య చికిత్స నిమిత్తం ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.