మోదంపల్లిలో.. ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ…

మోదంపల్లిలో.. ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ

జడ్చర్ల/ నేటి ధాత్రి.

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని మోదంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విగ్రహానికి పూలమాలలు అర్పించి, అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని, సమానత్వం, సామాజిక న్యాయం, విద్యాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ బాటలో నడిచి సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.

బడుగు వర్గాల ఆత్మ బంధువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్…

బడుగు వర్గాల ఆత్మ బంధువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్

అణగారిన వర్గాల అభివృ ద్ధికి కృషిచేసిన మహానుభా వుడు

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

అణగారిన వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని ధార పోసిన గొప్ప మహానుభావు డు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షులు బుచ్చిరెడ్డి అన్నారు. 135వ జయంతిని పురస్క రించుకొని కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్ర హానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లా డుతూ దేశంలోని పౌరులం దరికీ భారత రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం, స్వేచ్ఛ సమాన హక్కులు కల్పించిన గొప్ప తత్వవేత్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా రిజర్వేషన్ అమలు ప్రక్రియ గాని, పేదల కు సంక్షేమ పథకాలు అంది స్తూ రాజ్యాంగ విలువలను పెంపొందించే విధంగా కృషి చేస్తుందన్నారు. అన్ని రంగా ల్లో వివక్ష రహిత సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహాదార్శనికుడు అంబేద్కర్ కొనియాడారు. ప్రపంచంలోనే భారత దేశ పౌరుడు విశ్వవరుడిగా ఎదిగేందుకు దోహదపడేలా రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ గుర్తు చేశారు. ఆశయసాధన కోసం నేటి యువత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు పోలపల్లిశ్రీనివాస్ రెడ్డి,దుబాసి కృష్ణమూర్తి,పత్తిపాక సర్పంచ్ గజ్జిఐలయ్య,నిమ్మల రమేష్ డిటిరెడ్డి మారేపల్లి కట్టయ్య సాంబయ్య, మాదిరెడ్డి ప్రపం చరెడ్డి, శంకరాచారి వీరన్న, దామ కొండ కొమురయ్య, కుమారస్వామి పాల్గొన్నారు.

గుట్టలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు…

గుట్టలో బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
#యాదగిరిగుట్ట పట్టణం లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య
నేటిదాత్రి యాదగిరిగుట్ట:

 

భారతరత్న రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆటో కార్మికులు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు:

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు:

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని కూడలి వద్ద భూపాల పల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంక టరమణారెడ్డి, వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశాలమేరకు మం డల అధ్యక్షులు గంగుల మనో హర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మె తుకు తిరుపతి రెడ్డి ఆధ్వర్యం లోఅంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళుల ర్పించారు.

ఈ కార్య క్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, గ్రామశాఖఅధ్యక్షులు, ఉపా ధ్యక్షులు, ప్రధాన కార్యద ర్శులు,కోశాధికారులు, యూ త్ నాయకులు, సోషల్ మీడి యా కోఆర్డినేటర్లు, వివిధ సంఘాల అధ్యక్షులు, రైతు బంధు సమితి నాయకులు, మాజీ ఎంపీటీసీలు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, మ హిళా కార్యకర్తలు పాల్గొన్నా రు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version