భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

Transportation

భూపాలపల్లి జిల్లాలో విచ్చలవిడిగా ఇసుక రవాణా:-
ఇసుక క్వారీల లైసెన్సులు రద్దు చెయ్యాలి:-

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్:-

యు వై ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాపు యాదవ్ :-

భూపాలపల్లి నేటిధాత్రి:

 

శుక్రవారం రోజున సి పి ఐ ఎం ఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలోని ఇసుక రీచ్ ను సందర్శించడం జరిగిందని. అనంతరం ఆయన భూపాలపల్లి లో మాట్లాడుతూ అక్కడనుండి ఇష్టానుసారంగా అధిక లోడుతో వందలాది లారీలతో ఇసుకను తరలిస్తున్నారని అన్నారు. అదేవిధంగా కాటారం సబ్ డివిజన్ పరిధిలో 10 ఇసుక క్వారీలు నడుస్తున్నాయని విచ్చలవిడిగా ఇసుకను డంపు చేసుకుంటూ అధిక లోడుతో లారీల్లో తరలిస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించు కుంటున్నారని తక్షణమే వారి లైసెన్స్ రద్దు చేసి  ఇసుక క్వారీ యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అని డిమాండ్ చేసారు.సహజ సంపదను అక్రమంగా తరలించుకుంటు సొమ్ము చేసుకుంటున్నారని.

Transportation
Transportation

  గత ప్రభుత్వంలో ఇలాగే విచ్చలవిడిగా దందా కొన సాగిందని , ఈ ప్రభుత్వంలో నైనా మార్పు వస్తుందని ఆశించిన ప్రజల ఆకాంక్ష నెరవేర లేదని , ఇప్పుడు కూడా విచ్చలవిడిగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదన ద్యేయంగా దందా కొనసాగిస్తున్నారని , అనేకమంది నిరుపేదలు యాక్సిడెంట్లో చనిపోతున్నారని , కాళేశ్వరం నుండి భూపాలపల్లి కి రావాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రావాల్సిందే అని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉన్నదని, అధిక ఇసుక లోడ్ల తో లారీలు నడవడం వలన రోడ్లు మొత్తం కృంగి పోయాయి అని, ఇంత నష్టం జరుగుతున్న సంబంధిత అధికారులు చూచి చూడనట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇట్టి విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఒక వేళ తీసుకోకపోతే పార్టీ తరుపునుండి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!