నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..

నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

మహిళలకు ఉచిత బస్సుప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ దే

పరకాల నేటిధాత్రి
పట్టణంలో గురువారంరోజున పట్టణ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో 4నూతన ఆర్టీసీ బస్సులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని,2023 డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని అన్నారు.తెలంగాణ,కర్ణాటకలో మాత్రమే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అందిస్తున్నారని,త్వరలో ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయబోతున్నారని,రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల టికెట్లపై ఉచిత బస్ ప్రయాణాల ద్వారా ఆర్టీసీ కి 6వేల కోట్లు లాభం వచ్చిందని తెలిపారు.

రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు, సోలార్‌ ప్లాం ట్లు,క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలుకేంద్రాలు, డెయిరీ యూనిట్‌,ఇతర స్వయం ఉపాధి పథకాలతో ఆర్థికంగా భరోసా అందిస్తుందని వెల్లడించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి పథకంతోమహిళా సంఘాలు బస్సులు కొనుగోలు ద్వారా ఆర్థికంగా ప్రగతి సాధప్రజా రవాణాకు సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని,మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.త్వరలో పరకాల డిపోకు మరిన్ని బస్ లు రాబోతున్నాయని,పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని,ఉచిత బస్ ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్
రవిచందర్,నాయకులు,ఆర్టీసీ సిబ్బంది,ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version