జిఓ నెంబర్ 49 రద్దు చేయాలి.

జిఓ నెంబర్ 49 రద్దు చేయాలి

జిఓ నెంబర్ 49 రద్దు చేయకపోతే కార్మికవర్గాన్ని కలుపుకొని ఐక్య పోరాటాలే…

బడాపెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు ఊడిగానికేనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనా…

గందం రవి, పెద్దలచ్చన్న
సిఐటియు మందమర్రి మండల నాయకులు.

ఈరోజు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఏజెన్సీ బంద్ లో భాగంగా మందమర్రి మండలం రామకృష్ణపూర్ లో సింగరేణి సివిక్, రైల్వే సైడ్ అడ్డలలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు అధ్వర్యంలో నిరసన,జీఓ కాఫీల ధగ్దం చెయ్యడం జరిగింది.


బీజేపీ మోడీ ప్రభుత్వం ఆదివాసీ,
పేదలను వారి గ్రామల నుంచి,భూముల నుంచి వెళ్లగొట్టడం కోసం అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది.వీటిని రాష్ట్రంలో అమలు జరపడం కోసం బిజెపి మోడీ ప్రభుత్వానికి మద్దతుగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీఓ నంబర్ 49 తీసుకురావడం జరిగింది. ఈ జి ఓ అమలు జరపడం కోసం దొడ్డి దారిన ప్రయత్నాలు చేస్తున్నది.దీని వలన 339 గ్రామాలు,3 లక్షల ఎకరాల భూమిని ఆదివాసీలు,పేదలు కోల్పోవడం జరుగుతుంది.మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కవ్వల్ టైగర్ జోన్,ప్రాణహిత కృష్ణ జింకల ప్రాంతం,శివ్వారం మొసళ్ళ కేంద్రం పేర్లతో ఆంక్షలు విధించడం జరిగింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఆదివాసీలకు,పేదలకు వ్యతిరేకంగా, వారి జీవితాలను పూర్తిగా నాశనం చేసేలా ఉన్నాయి. అలాగే కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు, బడాపెట్టుబడిదారులకు బానిసలను చేసే కుట్రలను కూడా బిజెపి మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ఆదివాసీ, గిరిజన, పేదలే కాకుండా కార్మికవర్గం కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాలను విరమించుకోకుంటే ఐక్య
పోరాటాలను ఉధృతం చెయ్యడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం సిఐటియు డివిజన్ అధ్యక్షుడు గందం రవి, మండల నాయకులు పెద్దలచ్చన్న, లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, రాజయ్య, బానయ్య, రవీందర్, వెంకటేషశ్వర్ రావు, నరేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

నష్టం కలిగించే నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలి.

కార్మికులకు నష్టం కలిగించే నాలుగు నల్ల చట్టాలను రద్దు చేయాలి..

కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం

భూపాలపల్లి నేటిధాత్రి

కార్మికులకు నష్టాన్ని కలిగించే నాలుగు నల్ల చట్టాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఏఐటీయూసీ మధుగాని విజయేందర్, ఐఎన్టీయూసీ జోగబుచ్చయ్య, సి ఐ టియు కంపేటి రాజయ్య, టీబీజీకేఎస్ బడితల సమ్మయ్య లు డిమాండ్ చేశారు. కేటీకే ఓసి-3 యూజీ గని లో పిట్ సెక్రటరీ ఎల్ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్లో జాతీయ సంఘాల జేఏసీ నాయకులు పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు విభజించి కార్మిక హక్కులను కాల రాసిందని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వo బీజేపీ చట్టాలు సవరణ చేసి 4 నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేయబోతుందని వాపోయారు. ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను భూపాలపల్లి ఏరియాలోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో పనిచేసే కార్మికులంతా అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘాల నాయకులు నూకల చంద్రమౌళి, కార్మికులు పాల్గొన్నారు.

వక్ఫ్ బిల్లును రద్దు చేయాలి.

వక్ఫ్ బిల్లును రద్దు చేయాలి
-ఈనెల 13న హైదరాబాదులో ధర్నా విజయవంతం చేయాలి
-మర్కజీ ఇంతేజామీ మిల్లాతే ఇస్లామియా కమిటీ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా
మెట్ పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి

 

మెట్ పల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని మెట్ పల్లి మర్కజీ ఇంతేజామీ మిల్లాతే ఇస్లామియా కమిటీ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా డిమాండ్ చేశారు. గురువారం ఆయన మెట్ పల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 13న కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం దగ్గర మధ్యాహ్నం రెండు గంటలకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీ సోదరులు, అనుబంధ సంఘ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడికి అంకితం చేస్తూ ముస్లిం దాతలు ఇచ్చిన భూములు వక్ఫ్‌బోర్డు పరిధిలో అనాదిగా ఉన్నాయన్నారు. ఈ ఆస్తులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై ద్వేషంతో బడాబాబులకు అంటగట్టడానికి చట్టంలో మార్పులు తీసుకొని వచ్చిందన్నారు. పేదలకు చెందాల్సిన భూములను లాక్కోవడం ద్వారా ముస్లింలను ఆర్థికంగా బలహీనులను చేసి రాజకీయంగా, సామాజికంగా ఎదగకుండా చేయాలన్నది బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల ఆస్తులకు రక్షణగా ప్రత్యేక వక్ఫ్‌ చట్టాన్ని రాజ్యాంగం అమలు చేసిందని, మోదీ ప్రభుత్వం ముస్లింలను అణగదొకేందుకు ఈ చట్టాలను సవరణలు చేయాలని చూస్తున్నదని, దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా అధిక సంఖ్యలో ధర్నా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు సల్మాన్ ఖాన్ షేక్ షాహిద్ హుస్సేన్ సయ్యద్ సిరాజుద్దీన్ మహమ్మద్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version