వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని వాటర్ బెల్ ప్రారంభం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల పాఠశాలలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా మొట్టమొదటిసారిగా ఒడిస్సా రాష్ట్ర విద్యాశాఖ అన్ని పాఠశాలలో ఇకపై వాటర్ బెల్ కూడా ఉండాలని ఒరిస్సా విద్యాశాఖ నిర్ణయించింది విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాల సమయంలో మూడుసార్లు వాటర్ బెల్ మోగించాలనిఉత్తర్వులు జారీ చేసింది తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా బడిలో నీటి గంటలు వినిపించు సాంప్రదాయానికి జిల్లెల్లస్కూల్ లో శ్రీకారం చుట్టింది అనారోగ్య సమస్యలకు పుల్ స్టాప్ పెట్టేందుకు తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఉపాధ్యాయులు సాధారణంగా ఉపాధ్యాయులు వచ్చామా పాటలు చెప్పామా వెళ్ళామా అన్నట్టు ఉంటారు కానీ ఇక్కడ ఉపాధ్యాయులు మాత్రం అలా కాదు విద్యతో పాటు వారి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు వాటర్ తాగకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలియజేస్తూ అందుకే అలాంటి సమస్యలు చెక్కు పెట్టేందుకు వాటర్ తాగిస్తున్నామని పిల్లలు ఇంట్లో కంటే ఎక్కువ సమయం స్కూల్ లో గడుపుతుంటారు అందుకే వారితో ఎక్కువ వాటర్ తాగించాలని ఉద్దేశంతో స్కూల్లో వాటర్ బెల్ పెట్టామని ప్రతి విద్యార్థి ఇంటి నుంచి స్కూలుకి వచ్చి తిరిగి ఇంటికి చేరేవరకు కనీసం ఒక లీటర్ నీళ్లు తాగాలని వీరితోపాటు స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా నీరు తాగుతున్నారు ఈ ఉద్దేశంగా రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో వాటర్ బెల్స్ మోగించే విధంగా వారికి త్రాగునీరు అందించే విధంగా తగిన సదుపాయాలు చేపడతామని ఒడిశా విద్యాశాఖ నిర్ణయించిందని రాష్ట్రంలో విద్యాశాఖ అన్ని పాఠశాలలో ఇకపై వాటర్ బిల్ కూడా ఉంటుందని రాష్ట్రంలో పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!