– టియుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ ఆర్. లెనిన్
– వరంగల్ జిల్లా టియూడబ్ల్యూజే కార్యవర్గ సమావేశం
వరంగల్, నేటిధాత్రి
జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిద్దామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నారు. గురువారం వరంగల్ లోని వరంగల్ తూర్పు జర్నలిస్టు పరపతి సంఘం భవనంలో టియూడబ్ల్యూజే, టెంజు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీ యూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మిట్ట నవనీత్ గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా టి యు డబ్ల్యూ జే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిఆర్ లెనిన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది. కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు
సభ్యులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం, యూనియన్ ఐడి కార్డుల పంపిణీ, డెస్క్ జర్నలిస్టుల అక్రిడేషన్ కొనసాగింపు, ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ లో ఇప్పించేందుకు కృషి, వరంగల్లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహకారం, గుర్తింపు ఉన్న సంస్థల్లో పనిచేసే వారికే యూనియన్ సభ్యత్వాలు.అన్ని మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించట
సమావేశంలో పై తీర్మానాలను ఆమోదించిన
అనంతరం బి ఆర్. లెనిన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో డెస్క్ జర్నలిస్టులను గుర్తించి అల్లం నారాయణ అక్రిడిటేషన్లు ఇప్పిస్తే… ప్రస్తుత ప్రభుత్వం కోత పెట్టేందుకు సిద్ధమైందని, ఒక వేళ అదే జరిగితే పోరాటాలకు సిద్ధమని తెలిపారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులను అల్లం నారాయణ నేతృత్వంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కడుపులో పెట్టుకుని కాపాడుకుందని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించి జర్నలిస్టులకు మనోధైర్యాన్ని నింపిన ఘనత మన యూనియన్ కు దక్కుతుందని అన్నారు. యూనియన్ బలోపేతం అయితే ప్రెస్ క్లబ్ లను సునాయసంగా గెలుచుకోవచ్చన్నారు. అందుకుగాను వరంగల్ జిల్లా కమిటీ యూనియన్ బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు. ఇకమీదట యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ నిర్మాణాత్మకంగా పనిచేస్తూ సభ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పెరుమాడ్ల వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరిపై పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పిటిషన్ ను ప్రెస్ క్లబ్ కమిటీ వెనిక్కి తీసుకుని, వారి సభ్యత్వాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేసారు. టి యు డబ్ల్యూ జే 143 లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి యూనియన్ నుండి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి వారికి అండగా ఉండేందుకు కృషి చేస్తామన్నారు. నూతన సభ్యత్వాల నమోదును పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గుర్తింపు ఉన్న సంస్థల్లో పనిచేసే వారికే యూనియన్ సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గం లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు యూనియన్లు, అసోసియేషన్లు, ఫెడరేషన్ల పాత్ర కీలకంగా ఉంటుందని గుర్తు చేశారు. జర్నలిస్టులందరికీ ఎమ్మెల్యేల పరిధిలో ఇళ్ల స్థలాలు లేదా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా ఇప్పటివరకు మీడియా అకాడమీ కనీసం జర్నలిస్టులందరికీ నూతన అక్రిడేషన్లు ఇప్పించలేకపోయారని తెలిపారు. ఇంటి స్థలాలపై జర్నలిస్టులకు భరోసా ఇవ్వలేని పరిస్థితిలో పోటీ యూనియన్ ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాంకిడి శ్రీనివాస్, కోశాధికారి రాపల్లి ఉపేందర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మిట్ట నవనీత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నీలం శివ, కోశాధికారి శ్రీనివాస్,
ఉపాధ్యక్షుడు తౌటి కామేష్ , కంది భరత్, కమటం వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్ట్ బండి రవి టెంజు ఉపాధ్యక్షుడు పిండం విజయ్, అమీర్, విద్యాసాగర్, వేణు, జాయింట్ సెక్రెటరీ కిరణ్, ప్రభాకర్, అనిల్ ,రమేష్, సనత్, ప్రదీప్, ఈసీలు, చందు, సంతోష్, కృష్ణ, యుగేందర్, నరేందర్, రాజు, రాజేష్,