సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌ ఏఓ రాజేందర్‌, స్టేషన్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌లతో చర్చించారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను 15రోజులలో పరిష్కరించడానికి కషి చేస్తామని అన్నారు. అదేవిధంగా రైల్వేస్టేషన్‌లో ఏవైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని, తద్వారా సంబంధిత రైల్వేశాఖ మంత్రి దష్టికి తీసుకొనివెళ్లి వాటి పరిష్కారానికి కషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిర్మల, చాంద్‌పాషా, భగవాన్‌, గడప శివ, జీవన్‌, జాఫర్‌, అలీం, రైల్వే నాయకులు మోతిలాల్‌, బిఎంఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *