పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు
జడ్పీటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని వరంగల్ నగర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ తెలిపారు. మంగళవారం వరంగల్ ఆర్బన్ జిల్లాకు సంబంధించి మడికొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ధర్మసాగర్లోని వియంఅర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపిటిసి ఓట్ల లెక్కింపు కేంద్రాలను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు జరుగుతున్న కేంద్రాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎనిమిది కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోంది. డిసిపి స్థాయి పోలీస్ అధికారి పర్యవేక్షణలో ఎసిపి పోలీస్ అధికారి అధ్వర్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.