తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో నూతన ఇందిరమ్మ గృహప్రవేశాలు…..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరిగాయని సందర్భంగా తెలియజేస్తూ. మండలంలో తంగళ్ళపల్లి. లక్ష్మీపూర్ గ్రామాలలో నూతన గృహప్రవేశాలు జరిగాయని అలాగే. రాష్ట్రంలో ప్రజలకు ఇండ్లు లేని నిరుపేదలు ఉండరాదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని అందులో భాగంగా ఇందిరమ్మ గృహ పథకం తీసుకువచ్చిందని రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా. మండలంలో ప్రతి గ్రామంలో అర్హులైన నిరుపేదల అందరికీ ఇందిరమ్మ గృహ పథకం ద్వారా ప్రభుత్వం పరంగా లబ్ధిదారులకు ఇండ్లు నిర్మించుకోవడానికి విడుత లవారీగానిధులు మంజూరు చేస్తూ. వారి సొంతింటి కల నెరవేర్చుతుందని ప్రభుత్వపరంగా అధికారుల అందరూ సహకరిస్తున్నారని సకాలంలో గ్రామంలో ప్రతి లబ్ధిదారులు ఇట్టి మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ప్రభుత్వమే దగ్గరుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఇసుక కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తుందని ఎటువంటి నిధులకొరత లేకుండా. లబ్ధిదారులందరూ ఒక టో విడత రెండో విడుత లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తిచేసుకుని ఇండ్లు నిర్మించుకోవాలని సందర్భంగా తెలియజేశారు. ఇట్టి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో. తంగళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోర లక్ష్మీరాజం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. సుద్దాల కర్ణాకర్. లింగాల భూపతి. మచ్చ శ్రీనివాస్. పొన్నాల పరుశరాములు. రా పెళ్లి ఆనందం. రెడ్డి పరశురాములు. బండి పరిసరాములు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతన గృహ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
