రవాణా పై.కట్టుదిట్టమైనదిగా నిఘాచెక్పోస్టు ఏర్పాటు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం. జిల్లెల్ల గ్రామంలో పోలీస్ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా. బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణా తిరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లాలోని పశువుల అక్రమ రవాణాలను పూర్తిగా అరికట్టేందుకు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీత. ఆదేశాల మేరకు సోమవారం రోజున పశువుల అక్రమ రవాణా నిరోధించేందుకు జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్ట్ లు ఏర్పాట్లు చేశారని అందులో భాగంగా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో ప్రత్యేకంగా చెక్ పోస్ట్ఏర్పాటు చేశామని. అలాగే. స్టేషన్ పరిధిలోని ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ అనుమానస్పద వాహనాల పట్ల నిఘ తీవ్రతం చేస్తామని. పశువులు అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్య నేరమని ఇది .మూగజీవాల పట్ల క్రూరత్వాన్ని దారితీస్తుందని. ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని. అలాగే .గోరక్షణ పేరుతో చట్టాన్ని తమ చేతులకు తీసుకొని దాడులు చేయడం వాహనాల ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడడం చట్టరీత్యా నేరమని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని. ఎవరైనా పశువుల.అక్రమ రవాణకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని. అక్రమంగా పశువులను .తరలించే వ్యక్తులపై చట్టపరమైన కఠినచర్యలు తీసుకోవడం లో ఎలాంటి రాజీ ఉండదని జిల్లా ఎస్పి స్పష్టం చేశారనీ. సోషల్ మీడియా వేదికగా మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోని సహించబోమని. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని నిజా నిజాలు నిర్ధారించకుండా అసత్య ప్రచారాలు గ్రూపులలో ఫార్వర్డ్ చేసిన పోస్ట్ చేసిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్ లపై. కేసులో నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఇట్టి చెక్. పోస్టు.నిఘా ఏర్పాటు కార్యక్రమంలో. తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి ఎ.ఎస్సై. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
