ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన విద్యాధికారి….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండపల్లి మోడల్ స్కూల్ లో ఉచిత సమ్మర్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలం మండపల్లి లోని మోడల్ స్కూల్ లో ఉచిత క్యాంపునుమండల విద్యాధికారి. భూక్య రాజు ప్రారంభించారు. సమ్మర్ క్యాంపు మే 11.వ తేదీ నుండి 25.వ తేదీ వరకు అనగా. 15 రోజుల క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా (ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు). ఈ క్యాంపులో పాల్గొనవచ్చునని. ఇట్టి క్యాంపు కార్యక్రమంలో పిల్లలకు మ్యూజిక్. డ్యాన్స్. డ్రాయింగ్. స్టోరీ. టెల్లింగ్. ఇండోర్ గేమ్స్. అవుట్ డోర్ గేమ్స్. నేర్పించబడునని. ఇట్టి క్యాంపు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు మానసిక మరియు శారీరక అభివృద్ధి పెంపొందించుకోవచ్చునని. అలాగే. ఇట్టి సమ్మర్ క్యాంపులో పాల్గొని విద్యార్థులకు స్నాక్స్ ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయని. ఇందులో భాగంగా విద్యార్థులు అందరూ సద్వినియోగం చేయించుకోవాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో విద్యాధికారి బూక్యా. రాజు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్. మామిళ్ళ విట్టల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
