*ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవాలు ప్రారంభం*
*ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం*
*పరకాల,నేటిధాత్రి*
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్య వారోత్సవాల సందర్భంగా సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరకాలలో ఐఎఫ్పి,ఐడిపి కార్యక్రమాలను కళాశాల ప్రిన్సిపాల్ కే.సంపత్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా డిజిటల్ విద్యను అందిస్తున్నామని తెలిపారు.ఐఎఫ్పి,ఐడిపి ద్వారా విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధన అందించడంతో పాటు ఐఐటీ-జేఇఇ,నీట్,ఇఏపిసీఇటి వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు ఉదయం అల్పాహారం,మధ్యాహ్న భోజనం సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ కరపత్రాలను ఆవిష్కరించారు.కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
