Former MLA Attends Weddings
దుగ్గొండిలో పలు వివాహాలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పెద్ది
దుగ్గొండి, నేటిధాత్రి:
నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలో శుక్రవారం జరిగిన పలు వివాహ మహోత్సవాలకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.చలపర్తి గ్రామ బీఆర్ఎస్ నాయకులు నల్ల కమలాకర్ రెడ్డి – పద్మ దంపతుల కుమార్తె ప్రమోదిక రెడ్డి – అజయ్ రెడ్డి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మండల బీఆర్ఎస్ నాయకులు బాలే మల్లేశ్ కుమార్తె బ్రశాంతి – కుషాల్ వివాహం కనిష్క ఫంక్షన్ హాల్లో జరగగా, తోగర్రాయి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తుమ్మలపల్లి శ్రీనివాస్ కుమార్తె సౌమ్య – రాకేశ్ వివాహానికి, తోటకూరి శ్రీనివాస్ కుమార్తె రేష్మ – రాజకుమార్ వివాహం గిర్నిబావిలోని వందన గార్డెన్లో జరగగా ఆయా వివాహ మహోత్సవాల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.అలాగే రేఖంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మంద శ్రీనివాస్ – సునీత దంపతుల కుమారుడు తేజ – పూజా వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పీ వైస్ ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి,నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వర్ రావు, నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య,మండల పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, క్లస్టర్ బాధ్యులు, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు పిండి కుమారస్వామి, మాజీ సర్పంచ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
