Headlines

congress mptc abyarthi atmahatyayatnam, కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

ఓడిపోతానన్న భయంతో ఓ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి, పురుగుల మందు తాగారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లిలో జరిగింది. కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాచర్ల రాములు అప్పులపాలయ్యారు. దీనికి తోడు గెలిచే అవకాశం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగుల మందు, నిద్రమాత్రలు మింగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన రాములును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాములు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. తన భర్త రాములు ఏడేళ్లు టీఆర్‌ఎస్‌లో పనిచేసినా ఆ పార్టీ మోసం చేసిందని దుర్గ ఆరోపించారు. ఎంపీటీసీ అభ్యర్థిగా ఇంటిపెండెంట్‌గా బరిలోకి దిగిన తన భర్తకు కాంగ్రెస్‌ బి-ఫారమ్‌ ఇచ్చిందని అన్నారు. పలువురు సూటీపోటీ మాటలకు తోడు అప్పులపాలయ్యామన్న బాధతో పురుగులమందు తాగాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *