bahirangamga urithiyali, బహిరంగంగా ఉరితీయాలి..

బహిరంగంగా ఉరితీయాలి..

యాదాద్రి జిల్లా వలిగొండలో వికలాంగురాలైన మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన మహేందర్‌ను వెంటనే ఉరితీయాలని తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జన్ను రాజు అన్నారు. సోమవారం చిలుకూరు మండల రామాపురం గ్రామంలో అత్యాచారం చేసిన వ్యక్తి మహేందర్‌పై ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా పోలిసులు వ్యవహరించిన తీరుపై వికలాంగుల సంఘాలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఐనవోలు మండలకేంద్రంలో సింగారం గ్రామంలో తెలంగాణ వికలాంగుల ఫోరం ముఖ్యకార్యకర్తల సమావేశంలో జన్ను రాజు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర హోంమంత్రి వెంటనే స్పందించాలని, తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగ మహిళలపై రోజుకు ఒక్కో ప్రాంతంలో ఏదో చోట అత్యాచారాలకు పాల్పడుతున్న సకలాంగులపై చర్యలు తీసుకోవడంలో, వికలాంగుల మహిళలకు రక్షణ కల్పించడంలో తెలంగాణా రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. వికలాంగుల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ముఖ్యమంత్రి, హోంమంత్రి, డిజిపి స్థాయిలో సమీక్షా నిర్వహించి వికలాంగ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన 2016 వికలాంగుల చట్టాన్ని అమలుచేయాలని, తీసుకువచ్చేందుకు కషి వలిగోండలో వికలాంగురాలు బాలికపై అత్యాచారం చేసిన మహేందర్‌ను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోనీ పోలీసులను ఉద్యోగాల నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితురాలికీ న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వాలు వికలాంగులకు ఒక న్యాయం, సకలాంగులకు మరో న్యాయంలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సకలాంగుల మహిళపై అత్యాచారాలు జరిగితే నిర్భయ చట్జాలు తెచ్చిన ప్రభుత్వాలు, వికలాంగుల మహిళలపై అత్యాచారాలు జరిగితే అదే రీతిలో ఎందుకు స్పందించారని అన్నారు. గతంలో జానారెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్న సమయంలో వరంగల్‌ జిల్లాలో ప్రణీత, స్వప్నిక అనే ఇద్దరు యువతులపై యాసిడ్‌ దాడీ జరిగితే అప్పటీ ప్రభుత్వం అత్యాచారం చేసిన వారిపై ఎన్‌కౌంటర్‌ చేసిందనీ, మరి ఇప్పుడు వికలాంగుల మహిళలపై రోజురోజూకు అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వాలు ఎన్‌కౌంటర్‌కు సహకరించడం లేదని, ప్రభుత్వాలు వికలాంగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టివిఎఫ్‌ వరంగల్‌ జిల్లా ఇంచార్జ్‌ మడిగె నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంగారపు స్వామి, మండల అధ్యక్షుడు తాటికాయల రమేష్‌, సారయ్య, ఎల్లయ్య, హైమవతి, సతీష్‌, కుమార్‌, రమ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *