Ambedkar Gave Equal Rights to All: MLA Gandra
అంబేద్కర్ అందరికీ సమాన హక్కులు కల్పించాడు
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
దేశంలోనే ప్రజలందరికీ కులాలకు మతాలకు అతీతంగా రిజర్వేషన్లను హక్కులను కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు ఏప్రిల్ 14 మంగళవారం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హాజరయ్యారు అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహోన్నత వ్యక్తి దేశ ప్రజల అందరికీ పౌర హక్కులు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుటకు, పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలతో కూడిన-స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, అంతస్తులోను, అవకాశములోను – సమానత్వాన్ని చేకూర్చుటకు, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, దేశ ఐక్యమత్యం, అఖండతను, తప్పక తీసుకొచ్చే-సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించుకుని, రాజ్యాంగ పరిషత్ 1949వ సంవత్సరం నవంబరు 26వ తేదిన ఆమోదింపబడి, చట్టబద్దం కల్పించారు ఆ మహానీయులకు కృతజ్ఞతలు
42వ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికను సవరించడం జరిగింది. “సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యం”
దేశ ఐకమత్యం”కు బదులు “దేశ ఐక్యత-అఖండత”గా మార్చడం జరిగింది.
అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఇందిరా భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు ప్రజా సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
