Ration Dealers Extend Support
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన రేషన్ డీలర్స్
భూపాలపల్లి నేటిధాత్రి
గర్మిళ్లపల్లి గ్రామంలో రేషన్ డీలర్ ఇటీవల పెరికారి యుగేందర్ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన టేకుమట్ల మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు తోట పద్మ ఆధ్వర్యములో వారి కుటుంబాన్ని పరామర్శించి 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ సందర్బంగా అధ్యక్షురాలు తోట పద్మ మాట్లాడుతూ పెరికారి యుగేందర్ రావు మరణం మాకు తీరని లోటు అని ఈ కష్ట సమయం లో వారి యొక్క కుటుంబానికి మా యొక్క సంఘం అన్ని సమయాలలో వెన్నంటి ఉంటామని ఈ సందర్భంగ తేలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తోట సాగర్ నేరెళ్ల రామకృష్ణ ,సుంకర శ్రీనివాస రావు ,మలహల్ రావు ,శనిగరపు సంపత్ , జంగంపెల్లి రాజమల్లు ,ఆకునూరి ఓదెలు వివిధ గ్రామాల డీలర్లు పాల్గొన్నారు
