సొంత గూటికి టిఆర్ఎస్ నేతలు

మన్నె గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో తిరిగి టిఆర్ఎస్ లోకి…

సాదరంగా ఆహ్వానించిన గోవర్ధన్ రెడ్డి.

జూబ్లీ హిల్స్, నేటిధాత్రి ప్రతినిధి: 

ఇటీవల ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డితో కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ నాయకులు తిరిగి బుధవారం సొంత గూటికి చేరుకున్నారు. ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు మన్నె గొవర్థన్ రెడ్డి

నాయకత్వంలో తిరిగి వాళ్లు టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీ హిల్స్ డివిజన్, ఇందిరా నగర్ కాలనీకి చెందిన వారిని మన్నె గోవర్ధన్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు.  విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరిన సమయంలో వీళ్లంతా కండువా మార్చుకోవడానికి, పార్టీ

మారడానికి ఇష్ట పడలేదు. ససేమిరా అని చెప్పినా విజయారెడ్డి బెదిరింపులకు గురి చేసి, దగ్గరుండి తీసుకెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకునేలా చేశారని వాళ్లు వివరించారు. తన స్వార్థం కోసం లేనిపోనివి చెప్పి, తన రాజకీయ స్వలాభం కోసం తమ రాజకీయ భవిష్యత్తును విజయా రెడ్డి తాకట్టుపెట్టాలని చూశారని సొంత గూటికి చేరిన నాయకులన్నారు. తమను తన రాజకీయ స్వప్రయోజనాల కోసం తప్ప తమకు విజయా రెడ్డి ఏనాడు సరైన ప్రాధాన్యతనివ్వలేదని విమర్శించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న తెలంగాణ పార్టీలో, మన్నె గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో పార్టీకి సేవలందిస్తామని టిఆర్ఎస్ నాయకులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!