తృటిలో తప్పిన పెను ప్రమాదం

తృటిలో తప్పిన పెను ప్రమాదం

జనగాం జిల్లా రఘునాథపల్లి మండలకేంద్రంలో కారు ఎదురుగా రావడంతో ఆర్టీసి బస్సు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. భూపాలపల్లి డిపోకు చెందిన ఎపి 29 జడ్‌ 3750 నంబర్‌ గల బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలను ఒకవైపునకు మళ్లించారు. కారు రాంగ్‌ రూట్లో వేగంగా రావడంతో బస్సును పక్కన ఉన్న కంకర కుప్పలోకి డ్రైవర్‌ మళ్లించాడు. దీంతో బస్సును కంకర కుప్ప ఆపింది. డ్రైవర్‌ చాకచక్యంగా బస్సు నడపడంతో పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసి అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణీకులను మరో బస్సులో తరలించారు. కంకర కుప్ప లేకపోతే బస్సు బోల్తా పడేదని ప్రయాణీకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *