జహీరాబాద్ ఆస్తి, వాణిజ్య పన్నులు: 31వ తేదీలోపు చెల్లించకపోతే కఠిన చర్యలు…

జహీరాబాద్ ఆస్తి, వాణిజ్య పన్నులు: 31వ తేదీలోపు చెల్లించకపోతే కఠిన చర్యలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి, వాణిజ్య పన్నులను ఈ నెల 31వ తేదీలోపు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జైత్ రామ్ బుధవారం సూచించారు. పన్ను వసూలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో లేదా ఇంటికి వచ్చే బిల్ కలెక్టర్లకు పన్నులు చెల్లించవచ్చు.
గడువులోగా పన్నులు చెల్లించకపోతే తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సూచన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గానికి వర్తిస్తుంది.

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి..

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి

పలు వార్డులలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ 20 వ వార్డులో
భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య మున్సిపల్ కమిషనర్ ఉదయ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ దేవన్ కౌన్సిలర్లు రాజు నాయక్ మున్సిపాలిటీలోని పలు వార్డులలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్డులలో ఈరోజు పర్యటించడం జరిగింది సైడ్ కాలువలను డ్రైనేజీలను శుభ్రం చేయడం వార్డులలో చెత్త చెదారం లేకుండా మున్సిపాలిటీ సిబ్బంది పనిచేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వారు అన్నారు

ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తాం…

ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తాం

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం

వార్డు కౌన్సిలరుతో కలిసి వార్డులో పర్యటించిన

చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గల ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తామని మున్సిపాలిటి చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 2వ వార్డులోస్థానిక కౌన్సిలర్ కాంపెల్లి వీణ-విజేందర్ రెడ్డితో కలిసి శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటి ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా పర్యటించారు.అనంతరం ఛైర్ పర్సన్ మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉదయం వార్డులో పర్యటిస్తున్నప్పుడు తమ దృష్టికి ప్రతి సమస్యను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వార్డులను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.అదే విధంగా 2వ వార్డులో వాటర్ సమస్యను గుర్తించడం జరిగిందని పాడైపోయిన బోర్లు అలాగే బావులు రిపేర్ చేయించి నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టామని త్వరలోనే బావులు బోర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు.

వార్డులో అవసరమైన సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టి, నీటి సమస్య, పారిశుద్ధ పనులపై ప్రత్యేకమైన దృష్టి పెడతామని వార్డును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, సానిటేషన్ ఎస్సై శ్యామ్, 3వ వార్డు కౌన్సిలర్ ముత్తినేని వెంకన్న, 4వ వార్డు కౌన్సిలరు బీరం భరత్ రెడ్డి, వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ యుగంధర్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల నవీన్, చిదురాల రాంరెడ్డి, దూపటి కుమార్, కేశపాక సాంబయ్య, ఎండీ రజాక్, రహీం, తదితరులు పాల్గొన్నారు.

“కోహీర్ వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం…

“కోహీర్ వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం”.

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహీర్ మున్సిపల్ వార్డుల్లో చైర్మన్ మ్యాతరి అశోక్ ఆధ్వర్యంలో ఎక్కల్ దేవి కుంటలో అభివృద్ధి పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రోడ్ల మరమ్మతు పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చైర్మన్ ప్రారంభించారు. త్వరలో మున్సిపల్ కమిషనర్ అధికారిని నియమిస్తామని, గ్రామంలోని పదహారు వార్డుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అన్నన్ జావీద్, పట్టణ అధ్యక్షులు శంషీర్ అలీ, కౌన్సిలర్లు రఫిక్ బాయ్, మహమ్మద్ హైమద్, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు జగదీశ్, గోపాల్, ఆనంద్, అశోక్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కు అభినందనల వెల్లువ…

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కు అభినందనల వెల్లువ

కేసముద్రం/ నేటి ధాత్రి

ఇటీవల ఎన్నికయిన కేసముద్రం మున్సిపాలిటీ నూతన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ-నాగేశ్వర్ రావు ను కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ కేసముద్రం . ఉప్పరపల్లి రోడ్ ప్రైమరీ స్కూల్ ముందు మెయిన్ రోడ్డులో లోని పెద్దలు బానోతు బిక్షపతి కందుకూరి రవీంద్ర చారి ఎండి సలీం అడప మురళి బెతు కృష్ణమూర్తి కుమార్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు దేవ్ సింగ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కేసముద్రం మున్సిపాలిటీ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ చొరవ తో ఇంకా మరిన్నీ నిధులు కేసముద్రం కు కేటాయించేలా చూడాలని వైస్ చైర్ పర్సన్ ని కోరుతూ, ఇంకా తమ ప్రాంతంలో గల వివిధ సమస్యలను పరిష్కరించాలని వారికి విన్నవించడం జరిగింది

క్యాతన్ పల్లి నూతన మున్సిపల్ కమిషనర్‌గా మారుతి ప్రసాద్

మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

నూతన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సైతం ప్రాధాన్యత ఇస్తానని క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మారుతి ప్రసాద్ అన్నారు. రామగుండం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన ఏ మారుతీ ప్రసాద్ సాధారణ బదిలీల్లో భాగంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వచ్చి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని, సిబ్బంది సైతం సహకరించాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు సిబ్బంది కమిషనర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version