ఆమనగల్ మున్సిపల్ అభివృద్ధి లక్ష్యం.
ఆమనగల్/ నేటి ధాత్రి :
కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణంలో సోమవారం నాడు సురసముద్రం చెరువు అభివృద్ధి పనులు టి, యు, ఎఫ్, ఐ, డి, సి నిధులనుండి, రెండు కోట్ల 50 లక్షలతో సుందరీకరణ పనులను. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారి సహకారంతో చేపడుతున్న పనులను ఇరిగేషన్ డి ,ఈ, AE ,మున్సిపల్ డి, ఈ AE ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పత్యా నాయక్, కమిషనర్ శంకర్ నాయక్ కలిసి, మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ వేగవంతంగా చేయాలని అధికారులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కట్ట మైసమ్మ ఆలయ చైర్మన్ ముక్తాల వెంకటయ్య, ఎనిమిదో వార్డ్ ఎనుమల రమేష్, మాజీ వార్డ్ మెంబర్ పూసల సత్యం, గుండ్రాతి కుమార్ గౌడ్ ,గుద్దేటి శివ,కండే సాయి, ఎంగలి ప్రసాద్, బైకని యాదయ్య, సభావాట్ శ్రీను నాయక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు…
