ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

నాగర్ కర్నూల్ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు పాల్గొని పరిశుభ్రత పారిశుద్ధ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే గారు తానే స్వయంగా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ తో పాటు మున్సిపల్ స్టాప్ కలిసి చీపురు పట్టి శుభ్రత పనుల్లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కోసం ప్రత్యేక లోగోను రూపొందించారని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడమే కాకుండా వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా చర్చలు తీసుకుంటామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునీంద్ర వైస్ చైర్మన్ బాదం రమేష్ కౌన్సిలర్స్ వార్డ్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ ఏ ఈ పెద్ద ఎత్తున పాల్గొన్నారు

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి..

వార్డులను పరిశుభ్రంగా ఉంచాలి

పలు వార్డులలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17వ 20 వ వార్డులో
భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య మున్సిపల్ కమిషనర్ ఉదయ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ దేవన్ కౌన్సిలర్లు రాజు నాయక్ మున్సిపాలిటీలోని పలు వార్డులలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వార్డులలో ఈరోజు పర్యటించడం జరిగింది సైడ్ కాలువలను డ్రైనేజీలను శుభ్రం చేయడం వార్డులలో చెత్త చెదారం లేకుండా మున్సిపాలిటీ సిబ్బంది పనిచేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వారు అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version