ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తాం
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం
వార్డు కౌన్సిలరుతో కలిసి వార్డులో పర్యటించిన
చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గల ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తామని మున్సిపాలిటి చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 2వ వార్డులోస్థానిక కౌన్సిలర్ కాంపెల్లి వీణ-విజేందర్ రెడ్డితో కలిసి శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటి ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా పర్యటించారు.అనంతరం ఛైర్ పర్సన్ మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉదయం వార్డులో పర్యటిస్తున్నప్పుడు తమ దృష్టికి ప్రతి సమస్యను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వార్డులను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.అదే విధంగా 2వ వార్డులో వాటర్ సమస్యను గుర్తించడం జరిగిందని పాడైపోయిన బోర్లు అలాగే బావులు రిపేర్ చేయించి నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టామని త్వరలోనే బావులు బోర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు.
వార్డులో అవసరమైన సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టి, నీటి సమస్య, పారిశుద్ధ పనులపై ప్రత్యేకమైన దృష్టి పెడతామని వార్డును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, సానిటేషన్ ఎస్సై శ్యామ్, 3వ వార్డు కౌన్సిలర్ ముత్తినేని వెంకన్న, 4వ వార్డు కౌన్సిలరు బీరం భరత్ రెడ్డి, వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ యుగంధర్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల నవీన్, చిదురాల రాంరెడ్డి, దూపటి కుమార్, కేశపాక సాంబయ్య, ఎండీ రజాక్, రహీం, తదితరులు పాల్గొన్నారు.
