క్యాతన్ పల్లి నూతన మున్సిపల్ కమిషనర్‌గా మారుతి ప్రసాద్

మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

నూతన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సైతం ప్రాధాన్యత ఇస్తానని క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మారుతి ప్రసాద్ అన్నారు. రామగుండం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన ఏ మారుతీ ప్రసాద్ సాధారణ బదిలీల్లో భాగంగా క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వచ్చి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని, సిబ్బంది సైతం సహకరించాలని కోరారు.ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు సిబ్బంది కమిషనర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version