“కోహీర్ వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం…

“కోహీర్ వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం”.

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహీర్ మున్సిపల్ వార్డుల్లో చైర్మన్ మ్యాతరి అశోక్ ఆధ్వర్యంలో ఎక్కల్ దేవి కుంటలో అభివృద్ధి పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రోడ్ల మరమ్మతు పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చైర్మన్ ప్రారంభించారు. త్వరలో మున్సిపల్ కమిషనర్ అధికారిని నియమిస్తామని, గ్రామంలోని పదహారు వార్డుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అన్నన్ జావీద్, పట్టణ అధ్యక్షులు శంషీర్ అలీ, కౌన్సిలర్లు రఫిక్ బాయ్, మహమ్మద్ హైమద్, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు జగదీశ్, గోపాల్, ఆనంద్, అశోక్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version