వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి…

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
– బిజెపి పార్టీ పక్షాన వినతి పత్రం అందజేత

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కురిసిన అకాల వర్షం కారణంగా వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసినందున వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా లేదు కాబట్టి రైతులకు టార్పాలిన్ కవర్లను ప్రభుత్వం ద్వారా అందజేయాలని, మ్యాచర్ కండిషన్ లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులకు నష్టం కాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పక్షాన, బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిలు పొన్నాల తిరుపతి రెడ్డి, సిరికొండ శ్రీనివాస్ కోరారు.

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

మండల బిజెపి నాయకుల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలన..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

తంగళ్ళపల్లి. మండల కేంద్రంలో. మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా. మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం తాడూరులో తడిసిన ధాన్యాన్ని . పరిశీలించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం కొనుగోలు చేయాలని. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా. ప్రభుత్వ అధికారులు ఆరబెట్టిన వడ్లపై టార్పిలిన్లుకవర్లు. వరి ధాన్యం తడవకుండా. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వ అధికారులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ రైతులకు అవసరమైన సహాయం చేయాలని. కోరారు. అలాగే మండలంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించడానికి వెళ్లిన బిజెపి నాయకులతో ఐకెపి మహిళ వాగ్వాదానికి దిగిందని. 17%. తేమ ఉంటేనే. కొనుగోలు చేస్తామని. వరి ధాన్యాన్ని కలెక్టర్ అధికారులు వచ్చి ఎవరు నేర్పారని బిజెపి నాయకులను ఎదురు.బెదిరించే ప్రయత్నం చేసిందని. తడిసిన ధాన్యాన్ని పాక్స్ ఆధ్వర్యంలో. అయితే కొనుగోలు చేస్తుందా. అని . ఐకెపి మహిళ వాదించడం జరిగిందని. ఇట్టి కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు. వే న్నమనేని. శ్రీధర్ రావు. కౌన్సిల్ మెంబర్ కుల ఆంజనేయులు. జిల్లా మీడియా కన్వీనర్ మండల ప్రధాన కార్యదర్శి. ఇటికల రాజు. బూత్ అధ్యక్షులు బో ల్గం. భాస్కర్ గౌడ్. ఇటుకల మహేందర్. కన్నె అరుణ్ కుమార్. బక్క శెట్టి రాజేందర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి…

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి…

– ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రణవ్ సూచన

– ఐకెపి,ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు..

హుజురాబాద్, నేటి ధాత్రి:

రాష్ట్రానికి మొంథా తుఫాను ప్రభావం మరో రెండు రోజులు ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో,చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని దీని దృష్ట్యా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా ఇది వరి కోతల సమయం కాబట్టి పత్తి,వరి రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పే సూచనలను పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ మేరకు ధాన్యం కొనుగోలు విషయంలో త్వరితగతిన పూర్తి చేయాలని రైతులకు ఇబ్బంది కలగకుండా టార్ఫలిన్ కవర్లు అందించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

 

వీణవంక మండల కేంద్రంలోని పలు గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీ సెర్ప్ డిఆర్డిఏ (ఐకేపీ) ఆధ్వర్యంలో శుక్రవారం వీణవంక ,కనపర్తి, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. తహసీల్దార్ అనుపమ కనపర్తి లో,ఎంపీడీఓ వీణవంక లో,ఇప్పలపల్లి గ్రామంలో ఏపీఎం సుధాకర్,బ్రాహ్మణపల్లి లో ఎం ఎస్ సి సి పద్మ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్ మాట్లాడుతూ… రైతులు దళారులను నమ్మి ధాన్యం అమ్మవద్దని ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ కూడా అందిస్తుందని తెలిపారు రైతులు గమనించి ధాన్యం కొనుగోళ్లను ఐకెపి సెంటర్ ద్వారా నిర్వహించాలని కోరారు. రైతులు ఐకెపి సెంటర్ కొనుగోలుదారులకు సహకరిస్తే ధాన్యం తరలింపు సులువుగా ఉంటుందన్నారు సెంటర్ నిర్వాహకులు ప్రస్తుత వర్షాలను దృష్టిలో పెట్టుకొని ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చూడాలన్నారు. రైతులకు అందుబాటులో తార్పాలిన్ కవర్లు ఉంచి రైతులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాదాసు సునీల్, కామిడి శ్రీపతి రెడ్డి,ఎం డి. రషీద్ పాషా, సీసీలు ఎన్. ఆనంద్,ఎస్.తిరుపతి,వి.తిరుపతి,ఎస్.ఘన శ్యామ్ అన్ని గ్రామాల అధ్యక్షురాలు,కొనుగోలు కమిటీ మెంబర్ లు గ్రామాల వి ఓ ఏ. లు, రైతులు ,హమలీలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version