దేశానికి డా.బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివి: జిల్లా ఎస్పీ

దేశానికి డా.బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివి: జిల్లా ఎస్పీ

ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు.

డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల సందర్భంగా Arrive-Alive లో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమాలు.

సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు దేశానికి డా.బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే కొనియాడారు.భారతరత్న డా.బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

డా.బి ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే పేరొందిన గొప్ప న్యాయవాది,మానవతావాది ఆని,లండన్ లో ప్రముఖ విశ్వ విద్యాలయం డా.బి ఆర్ అంబేద్కర్ కు మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ప్రధానం చేసిందన్నారు.అన్ని అంశాల్లో పట్టున్న గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని అన్నారు.దేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగమును రాసి భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే అనేక సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపారని కొనియాడారు.డా.బిఆర్ అంబేద్కర్ కలలుగన్నా దేశంగా,సూపర్ పవర్ గా భారత్ ఎదగాలంటే తల్లిదండ్రులు పిల్లలని చదువు వైపు ప్రోత్సాహించాలని , నేటి యువత అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ కార్యక్రమాలు..

జిల్లా వ్యాప్తంగా డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా( ‘Arrive Alive’ )
కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహించి వాహనదారులు, ప్రజలతో కలిసి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టాడం జరిగిందన్నారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించడం,సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ నటేష్,ఆర్.ఐ లు మధుకర్,రమేష్, ఎస్.ఐ కిరణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి…

వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి

ఎమ్మెల్యే గండ్రసత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో గల రైతు వేదిక ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు పోలీ స్ శాఖ మహోత్తరమైన కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ద్విచక్ర వాహనదారు లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహన దారు లకు తెలియజేశారు వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ప్రమా దాల సమయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చు హెల్మెట్ ఒకటే ప్రధానమని అన్నారు. ప్రధాన రహదారులపై ద్విచక్ర వాహనాల సహాయంతో ఇంటికి చేరుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరి.

మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు

ఎస్సై పరమేష్

రహదారిపై ప్రయాణించే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్మెట్ పెట్టుకోవడం ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఎస్ఐ పరమేష్ కోరారు రోడ్డు భద్రత ప్రగతి ప్రణాళిక,నియంత్రణ ప్రణాళిక గురించి ప్రజలకు వివరిం చాడు. ఒకవేళ మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామనీ హెచ్చరించారు

జైపూర్ పోలీసుల రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై ప్రయాణికులకు అవగాహన

జైపూర్,నేటి ధాత్రి:

 

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జైపూర్ పోలీసులు పేర్కొన్నారు.శనివారం స్థానిక పిఎస్ పరిధిలో వాహనదారులకు అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతా నియమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ హబీబ్ మాట్లాడుతూ ఈ నెల 01 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన భద్రతా నియమాలను వివిధ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని,కార్ల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని,పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వకూడదని,వాహనాలకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, పరిమితికి మించిన వేగంతో వెళ్లకూడదని, శబ్ద కాలుష్యానికి కారణం కాకూడదని వాహనదారులకు సూచించారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version