వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి
ఎమ్మెల్యే గండ్రసత్యనారా యణరావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో గల రైతు వేదిక ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 18 వరకు పోలీ స్ శాఖ మహోత్తరమైన కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ద్విచక్ర వాహనదారు లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహన దారు లకు తెలియజేశారు వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి ప్రమా దాల సమయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చు హెల్మెట్ ఒకటే ప్రధానమని అన్నారు. ప్రధాన రహదారులపై ద్విచక్ర వాహనాల సహాయంతో ఇంటికి చేరుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరి.
మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు
ఎస్సై పరమేష్
రహదారిపై ప్రయాణించే వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హెల్మెట్ పెట్టుకోవడం ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఎస్ఐ పరమేష్ కోరారు రోడ్డు భద్రత ప్రగతి ప్రణాళిక,నియంత్రణ ప్రణాళిక గురించి ప్రజలకు వివరిం చాడు. ఒకవేళ మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామనీ హెచ్చరించారు
