కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన.!

కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన చిలువేరు సమ్మయ్య గౌడ్. 

యువత పట్ల సమ్మి గౌడ్ సహాయ సహకారాలు ఆదర్శనీయం – డివైఎఫ్ఐ యువజన సంఘం

కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామంలో సోమవారం డి వై ఎఫ్ ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ ను నిర్వహించిన సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమ్మి గౌడ్ మాట్లాడుతూ క్రీడలు మానవ జీవితంలో అంతర్భాగమని క్రీడలు విద్యార్థుల మానసిక ఎదుగుదలకు సోపానాలని ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుందని ప్రతి ఒక్క విద్యార్థి క్రీడలలో పాల్గొనాలని పలికారు. అంతేకాదు క్రీడలతోనే ఉజ్వలమైన భవిష్యత్ ను పొందుతారని అన్నారు. క్రీడల వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా మానసిక శారీరక దృఢత్వాన్ని పెంచుకోవచ్చని, అదేవిధంగా డివైఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘం వారు మాట్లాడుతూ క్రీడలు నిర్వహించాలని ఆలోచనతో సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ సమ్మయ్య గౌడ్ వద్దకు వెళ్లి విషయం తెలిపిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి యువత చెడు దారి పట్టుతున్న ఈ రోజుల్లో మీలో ఇలాంటి ఆలోచనలు రావడం గర్వించదగ్గ విషయమని మీరు ఇతరులకు ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తున్న మీ కార్యక్రమాలకు నేను ఎల్లవేళలా అండగా ఉంటానని మాకు భరోసా కల్పించి మమ్మల్ని ముందుకు నడిచేలా ప్రోత్సహించి ప్రధమ బహుమతిగా రూ.10,116 లు అందజేస్తూ ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అండగా ఉంటానని భరోసా కల్పించి మా ఆహ్వానం మేరకు విచ్చేసి కబడ్డీ పోటీలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా ద్వితీయ బహుమతిగా డి.ఈ విజయ్ రూ. 5,015 రూపాయలను అందిస్తున్నారని తెలిపారు..

ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, కొండేటి కళాధర్, గొడిషాల వెంకన్న, రాచర్ల రాములు, గొర్రె వెంకన్న గౌడ్, కాలేరు వెంకన్న, కందుకూరి దాస్, తీగల సునీత, మేన్పు పద్మ, వల్లాల రాజేందర్, వల్లాల శ్రవణ్, అనిల్, శాల్వా సుమన్, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version