మహేశ్వరంలో ప్రతి ఆర్టీసీ బస్సు హల్టింగ్ అవ్వాలి…

మహేశ్వరంలో ప్రతి ఆర్టీసీ బస్సు హల్టింగ్ అవ్వాలి…

డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మికి వినతిపత్రం సమర్పణ..

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణ నూతన విలీన గ్రామం మహేశ్వరంలో ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సు హల్టింగ్ ఇవ్వాలని డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మీకి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో చాలా మంది ఉద్యోగం,విద్యా,వైద్య నిమిత్తం హన్మకొండ, హైదరాబాద్ కి వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులు ఆగడంలేదు ఇందువలన నర్సంపేటకి వచ్చి బస్సు ఎక్కడం అవుతుందని తెలిపారు. అలాగే రాత్రి సమయాల్లో హన్మకొండ నుండి నర్సంపేటకి వచ్చే బస్సులు మహేశ్వరం వద్ద ఆపటం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించి సమస్యకి పరిష్కారం చూపించి అన్ని బస్సులు ఆపే దిశగా చూస్తాఅని హామీ ఇచ్చారు. బస్సులు ఆపకుంటే అలాగే డిపో సమాచారం నెంబర్ కి కాల్ చేయాలని తెలిపారు. వినతిపత్రం అందచేసిన వారిలో కౌన్సిలర్లు మాతృ రాథోడ్,భూస శిరీష-రాజు,గ్రామస్తులు చెన్న భాస్కర్,బేతం అఖిల్,చిదురాల చక్రపాణి ,మోర్తాల రాజు,బొల్ల శ్రీకాంత్, చెన్న గణేష్,చేరాల ప్రదీప్,భూక్య సాయి కళ్యాణ్ పాల్గొన్నారు.

రాయికల్ తాసిల్దార్‌కు పౌర సదుపాయాల కోసం వినతి పత్రం

రాయికల్ తాసిల్దార్ నాగార్జునకు వినతి పత్రం

రాయికల్ జనవరి 23 నేటి ధాత్రి:

పట్టణంలో గత అనేక సంవత్సరాలుగా అగ్నిమాపక కేంద్రం ,ప్రభుత్వ డిగ్రీ కళాశాల ,మినీ స్టేడియం,హైదర బాద్ ,బొంబాయి బస్సు పునరుద్ధరణ ,పూర్తీ సౌకర్యాలు కలిగిన బస్సు స్టేషన్ మరియు అంగడి బజార్ లో బస్ సెల్దర్ ,ఇట్టి సమస్యలు గత అనేక సంవత్సరాలుగా ఎద్దండి భూమారెడ్డి ,తురగ శ్రీధర్ రెడ్డి ,సర్గీయ జర్నలిస్ట్ ముంజ ధర్మపురి గౌడ్ జర్నలిస్ట్ ,ప్రజా సంఘాల నాయకులు ఉద్యమించినప్పటికిని స్పందన కరువైనది గత అనేక సంవత్సరాలు ప్రజల సమస్యలు పరిష్కకరం నోచుకోకుండా ఉన్న సమస్యలు అగ్నిమాపక కేంద్రం లేక అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు భారీగా ప్రజలు నష్ట పోతున్నారు ,డిగ్రీ విద్యా అందుబాటులో లేక అనేక విద్యార్థులు ఉన్నత విద్యా అందడం లేదు చదువు మధ్యలోనే మానేస్తున్నారు,కాగ దాదాపు మండలం నుండి యాభై శాతంకు పైగా విద్యార్థులు ఉన్నత విద్య కోసం హైదరా బాద్ నగరంలో ఉన్నారు వారి రాకపోకల నిమిత్తం హైదరాబాద్ బస్సు అత్యవసరం మరియు బాబాయి లాంటి నగరంలో ఆస్తులు ,చుట్టరికాలు ,వివిధ పనులకోసం బాబాయి తరుచుగా వెళ్లి వస్తుంటారు కాగ తక్షణమే ఇట్టి రెండు నగరాల బస్సులు పునరుద్ధరించగలరు మరియు పూర్తీ సౌకర్యాల బస్సు స్టేషన్ ను మరియు అంగడి బజార్ లో బస్సు సెల్దార్ నిర్మాణం చేయించగలరు మరియు రెండు కోట్ల రూపాయల పది లక్షల రూపాయలు నిధులు రాగ సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా అసంపూర్తి నిర్మాణం గానే ఉంది ఇట్టి సమస్యల్ని తక్షణమే పరిష్కరించవలసిందిగా ప్రార్థన

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version