పరకాల నుండి వేములవాడకు 2ప్రత్యేక బస్సులు

పరకాల నుండి వేములవాడకు 2ప్రత్యేక బస్సులు

డిపో మేనేజర్ జి.రాంప్రసాద్

పరకాల,నేటిధాత్రి

 

పరకాల బస్టాండ్ నుండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం రెండు ఎక్ష్ప్రెస్స్ బస్సులను ప్రారంభిస్తున్నట్టు డిపో మేనేజర్ రాంప్రసాద్ ఓ ప్రకటన లో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వీసులు 4జనవరి ఆదివారం నుండి అందుబాటులో ఉండనున్నట్టు తెలిపారు.బస్సులు బయలుదేరు సమయం ఉదయం 7:30 మరియు 9గంటలకు తిరిగి మధ్యాహ్నం 2:45 నిమిషాలకు మరియు 4గంటలకు అందుబాటులో ఉంటాయని ఈ అవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంత (భక్తులు)ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫక్రుద్దీన్…

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫక్రుద్దీన్

◆:- కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మొహమ్మద్ ఫక్రుద్దీన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి
ఇతర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్రికెటర్గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన అజారుద్దీన్, 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, 2009లో కాంగ్రెస్ పార్టీ లో చేరి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు. ఈ సందర్భంగా ఝరాసంగం గ్రామ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ యువ నాయకులు మొహమ్మద్ ఫక్రుద్దీన్ శుభాకాంక్షలు తెలియజేశారు,

మంత్రి కొండా సురేఖకు తీర్థప్రసాదాలను అందజేస్తున్న వేముల మహేందర్ గౌడ్…

మంత్రి కొండా సురేఖకు తీర్థప్రసాదాలను అందజేస్తున్న వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంను దర్శించుకుని మొక్కులను సమర్పించిన బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ శుక్రవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను శుక్రవారం హన్మకొండలోని రాంనగర్ లో గల మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి తీర్థ ప్రసాదలను అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి. ఎండోమెంట్ అధికారులు భక్తులకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారా..? లేదా అని మహేందర్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. తమరి ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల అభివృద్ధి పనులు చక చకా జరుగుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు సంబంధించి ఎక్కువ నిధులను కేటాయించి..ప్రజలకు మెరుగైన వసతులతో పాటు..ప్రజలలో ఆధ్యాత్మికత పెంపొందించే విధంగా..అనేక కార్యక్రమాలు తీసుకుంటున్న సందర్భంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు మీపై, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు వేముల మహేందర్ గౌడ్ మంత్రి కొండా సురేఖకు తెలిపారు.

జగద్గురుల ఆశీస్సులతో వేములవాడ ఆలయ అభివృద్ధికి నూతన దశ…

జగద్గురుల ఆశీస్సులతో వేములవాడ ఆలయ అభివృద్ధికి నూతన దశ…!!

– సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి నిదర్శనం – వేములవాడ రాజన్న ఆలయం..!!
సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వచనం పొందారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి మరియు ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

“ధర్మ విజయ యాత్ర” లో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు.
ముఖ్యంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, యాత్రికుల సౌకర్యాల విస్తరణ, మౌలిక వసతుల మెరుగుదల, దివ్యక్షేత్ర పునరుద్ధరణ ప్రణాళికలను వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని వేములవాడ ఆలయ అభివృద్ధి పట్ల ప్రభుత్వ కట్టుబాటు మరియు జరుగుతున్న పనుల పురోగతిని స్వామివారికి వివరించారు.
జగద్గురుల ఆశీస్సులతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మరింత వైభవంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడండి…

హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా చూడండి
– బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్ల (నేటి ధాత్రి):

 

వేములవాడ ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా కోటిలింగాలను అక్కడి నుండి మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆలయ ప్రాంగణంలో ఇతర మతస్తుల నిర్మాణాలు కూడా ఉన్నవి వాటిని జరపకుండా కోటిలింగాలను మాత్రమే జరపాలని ప్రయత్నం చేస్తున్నారని దీనివలన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్ (విటిఏ.డి.ఏ) వైస్ చైర్మన్ కి మంగళవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కనుక ముందుగా దర్గాను తొలగించిన తర్వాత ఏ కార్యక్రమమైన చేపట్టాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరపున జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం, సంతోష్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజు రెడ్డి, జిల్లా కార్యదర్శి గొప్పడి సురేందర్రావు, జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు రావు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు వేణుగోపాలరావు, కోడె రమేష్, మిర్యాల్కార్ బాలాజీ, రాపెల్లి శ్రీధర్, బురుగుపల్లి పరమేష్, సౌల క్రాంతి, బిజెపి సీనియర్ నాయకులు గజ బింకర్ చందు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version