ములుగులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందడి..
#తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు!
ములుగు, నేటిధాత్రి:
జిల్లా కేంద్రమైన ములుగులో తొలి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఉదయం నుండే ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొంది.
మహిళలు, వృద్ధులు మరియు యువ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
మొదటి మున్సిపల్ ఎన్నికలు కావడంతో స్థానిక ప్రజల్లో భారీగా ఆసక్తి నెలకొంది.
