గీతాంజలిలో రోడ్డు భద్రత అవగాహన

గీతాంజలిలో రోడ్డు భద్రతపై అవగాహన

నర్సంపేట,నేటిధాత్రి:

 

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో గీతాంజలి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రోడ్డు భద్రత అవగాహనా సదస్సును ఘనంగా నిర్వహించారు. నిత్యం ఆందోళనకు గురిచేస్తున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాల పాటన అత్యంత కీలకమని కార్యక్రమంలో పాల్గొన్న విద్యావేత్తలు తెలిపారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ కొర్ర సారయ్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం, ఓవర్‌లోడింగ్ వంటి కారణాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం మాత్రమే సరైన మార్గమని ఆయన వివరించారు.అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. రాజేష్ ఆధ్వర్యంలో విద్యార్థులు పాఖాల రోడ్డు కూడలి వరకు రోడ్డు భద్రత నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఒక చిన్న నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో పాటు రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందని పేర్కొన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ కుటుంబంతో సంతోషంగా జీవించాలని హితవు పలికారు.

రోడ్డు భద్రత-జీవన రక్షణ, హెల్మెట్ ధరించు-ప్రాణాలు కాపాడు.

రోడ్డు భద్రత-జీవన రక్షణ, హెల్మెట్ ధరించు-ప్రాణాలు కాపాడు.

గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య, డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై గోపాల్ రెడ్డి

కోదాడ, నేటి ధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సర్పంచ్ మందుల నాగయ్య ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ. ఆరైవ్-ఆలైవ్ నినాదంతో రోడ్డు ప్రమాదాలు నివారణ హెల్మెట్, సీట్ బెల్ట్, ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలలో ప్రజలు వ్యాధుల ఇతర కారణాలతో ఎక్కువ మరణాలు జరగడంలేదని రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. భవిష్యత్తు ప్రణాళికలు రక్షించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాల వీధిన పడుతున్నాయని ప్రతి వాహనదారుడు ఇంటి నుంచి వెళ్ళింది మొదలు ఇంటికి వచ్చేవరకు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సర్పంచ్ మందుల నాగయ్య మాట్లాడుతూ. స్థానిక పోలీస్ సిబ్బంది గ్రామస్తులు విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రత నియమ అంశాల తెలియజేస్తూ రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలని. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని. కార్లలో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని. మితిమీరిన వేగంతో వెళ్లకూడదని అన్నారు. ముఖ్యంగా గ్రామంలోని ప్రజలకు యువతకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, వర్క్ ఇన్స్పెక్టర్ ఈసి, గ్రామ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు యువకులు, మహిళలు గ్రామ ప్రజలు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం

మల్చల్మ గ్రామంలో ఉన్న వీరన్న వాగు చెరువు తూములు మూడు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంవత్సరాలుగా.సరిగా పనిచేయకపోవడంతో సారవంతమైన వ్యవసాయ భూములకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై మాజీ ఎంపీటీసీ శెట్టి నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెరువు తూములను వెంటనే మరమ్మతు చేసి రైతులకు నీటి సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయాన్ని కొనసాగించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అధికారులు తక్షణ చర్యలు తీసుకొని చెరువు తూములను పునరుద్ధరించి సాగునీటి సమస్యను పరిష్కరించాలనరు

మోటార్ వాహన చట్టం కఠినంగా పాటించాలి – ఎస్ఐ బోరగాల అశోక్

మోటార్ వాహనాల చట్టాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యం

-ఎస్ఐ బోరగాల అశోక్

 

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా చేపట్టిన రోడ్డు భద్రత కార్యక్రమాన్ని మొగుళ్ళపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొగుళ్ళపల్లి ఎస్ఐ బోరగాల అశోక్, సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు, ఉప సర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు-కోటేశ్వర్ రావు దంపతులు, పంచాయతీ సెక్రెటరీ నరేష్ లు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరైన ప్రజలు, యువకులనుద్దేశించి ఎస్ఐ బోరగాల అశోక్ మాట్లాడారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపడం వలన విలువైన ప్రాణాలను కోల్పోతున్నామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మైనర్ పిల్లలకు వాహనాలను అప్పగిస్తే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నియమాలు, మోటర్ వాహనాల చట్టాన్ని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రాన్ని నిర్మించగలమన్నారు. రోడ్డు భద్రతను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని, ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version