ఓదెల మల్లికార్జున దేవస్థానంలో రోడ్డు భద్రత అవగాహన

ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించిన పోత్కపల్లి పోలీస్..

ఓదెల( పెద్దపల్లి జిల్లా) నేటి ధాత్రి

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఓదెల మల్లన్న దేవాలయంలో పోత్కపల్లి పోలీస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోత్కపల్లి పోలీస్ మాట్లాడుతూ,ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలి.రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేయకూడదు.ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ గా వాహనం నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు మరణాలు సంభావిస్తాయి.ట్రాఫిక్ కి సంబంధించిన నియమ నిబంధనలు పాటించాలి.రోడ్డుకు అడ్డంగా అటు ఇటు కాకుండా పార్కింగ్ ఏరియాలో మాత్రమే వాహనాలు పార్కు చేయాలి.ఎప్పుడైనా రోడ్డు ప్రమాదం జరుగుతే డయల్ 112 కాల్ చేసి రోడ్డు ప్రమాదం సంబంధించిన సమాచారం ఇవ్వాలి.సిగ్నల్ జంప్ చేయడం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు వీలందనైనంత త్వరగా తరలించాలి అని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version