కాట్రియాలలో శివాజీ విగ్రహ భూమి పూజ చిచ్చు…

 కాట్రియాలలో శివాజీ విగ్రహ భూమి పూజ చిచ్చు.
మూడు రోజులుగా ముదిరిన వివాదం.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు.

రామాయంపేట నేటి ధాత్రి (మెదక్ )

శివాజీ విగ్రహ స్థాపన స్థల వివాదం ఆ ఊర్లో వివాదాన్ని తెచ్చిపెట్టింది.ఇరు వర్గాల్లో గొడవ పెరిగి పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది.వివరాల్లోకెళ్తే.. రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో మూడు రోజుల క్రితం శివాజీ విగ్రహ భూమి పూజకు యువత ఏర్పాట్లు చేసింది.అది ప్రభుత్వ స్థలం అంటూ ఒకరు వాదించగా..పనులు ఆగాయి.దీంతో కోపోద్రిక్తులైన యువకులు,మరొకరి మధ్య మాటల యుద్ధం పెరిగి గ్రామంలో గొడవ రాసుకుంటున్నది.

మాజీ ఎంపీ రావుల సన్నిహితుడు రాగివేణు మృతి పట్ల దిగ్భ్రాంతి.

మాజీ ఎంపీ రావుల సన్నిహితుడు రాగివేణు మృతి పట్ల దిగ్భ్రాంతి.

వనపర్తి నేటిదాత్రి .

మాజీ ఎంపీ వనపర్తి మాజీ ఎమ్మెల్యే
రావుల.చంద్రశేఖర్ రెడ్డి రాగివేణు మృతిపట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు ఈసందర్భంగా రావుల మాట్లాడుతూ వనపర్తి రాయిగడ్డ 1వ వార్డు రాగివేణు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాకు ఆత్మీయుడు గా అన్నిటికీ నాతో పాటు సుదీర్ఘకాలం పనిచేసి మమ్మల్ని వీడి పోవడం నన్ను కలచి వేసిందని అన్నారు వేణు
కుమారుడు చంద్రశేఖర్ తో రావు ల ఫోన్ లో మాట్లాడి కుటుంబసభ్యులను ఓదార్చి దైర్యంగా ఉండాలని తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారువేణు ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని ఆకాంక్షించారు

అతివగం కారణంగా బోల్తా పడ్డ బోలోరో ఒకరికి గాయాలు…

అతివగం కారణంగా బోల్తా పడ్డ బోలోరో ఒకరికి గాయాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ హైవే సంగారెడ్డి మెయిన్ రోడ్డులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అతివేగమే దీనికి కారణమని చెబుతున్నారు.స్కూటర్ నడుపుతున్న షాక్, బొలెరో కారును అధిగమించడానికి ప్రయత్నించాగా.బొలెరో కారు బోల్తా పడింది, ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తికి గాయమైంది, అతని చేయి తెగిపోయింది.అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.స్కూటర్ నడుపుతున్న వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version