రోహిత్ శర్మ కొత్త కార్ నంబర్ వెనుక అంత సీక్రెట్ ఉందా..

రోహిత్ శర్మ కొత్త కార్ నంబర్ వెనుక అంత సీక్రెట్ ఉందా.. తెలిస్తే మైండ్ బ్లాంకే

 ఆగస్టులో జరగాల్సిన బంగ్లాదేశ్ సిరీస్ రద్దు కావడంతో టీమిండియా తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి మొదలుకానుంది. ఆస్ట్రేలియాతో విదేశీ సిరీస్ ఆడనుంది. అయితే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రోహిత్, కోహ్లీ వన్డేలు ఆడతారా లేదా అనేది ఊహాజనిత విషయం. ఇద్దరు కలిపి 83 వన్డే సెంచరీలు, 25,000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. అయితే, అక్టోబర్ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు కొనసాగగలరా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Rohit Sharma Buy New Lamborghini Urus: రోహిత్ చివరిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ముంబై ఇండియన్స్ తరఫున పోటీ క్రికెట్ మ్యాచ్‌లో ఆడాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే మ్యాచ్‌లో అతను పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్ అంతర్జాతీయ క్రికెట్‌లో అతని చివరిది కావొచ్చు అని తెలుస్తోంది.

ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ ల వన్డే భవిష్యత్తు గురించి ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కానీ భారత క్రికెట్ బోర్డులోని నిర్ణయాధికారులను బట్టి చూస్తే, ఇద్దరు దిగ్గజాలపై వెంటనే నిర్ణయం తీసుకోవడానికి తొందరపడాల్సిన అవసరం లేదన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కార్ల కలెక్షన్‌లో కొత్తగా లంబోర్ఘిని ఊరుస్ ఎస్‌ఈని చేర్చారు. ఆరెంజ్ రంగులో ఉన్న ఈ కారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ‘3015’పైనే అందరి దృష్టి పడింది. గతంలో రోహిత్ శర్మ కారు నెంబర్ ‘264’. అది ఆయన వన్డేల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. అయితే, ఇప్పుడు ఈ కొత్త నెంబర్ వెనుక ఉన్న కథ అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.

వరల్డ్ కప్ ఫైనల్‌లో పంత్ నాటకం నిజం బయటపెట్టిన రోహిత్.

 వరల్డ్ కప్ ఫైనల్‌లో పంత్ నాటకం నిజం బయటపెట్టిన రోహిత్…

 

జూన్ 29. టీమిండియా చరిత్రలో ఇది మర్చిపోలేని రోజు. సరిగ్గా ఏడాది కింద ఇదే తేదీ నాడు టీ20 ప్రపంచ కప్-2024ను కైవసం చేసుకుంది భారత జట్టు. కప్పు కలను తీర్చుకొని కోట్లాది మంది అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తింది.

జూన్ 29, 2024.. ఈ తేదీ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ రోజునే టీ20 వరల్డ్ కప్-2024ను గెలుచుకుంది టీమిండియా. సరిగ్గా ఏడాది కింద జరిగిన ఫైనల్ సమరంలో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో మట్టికరిపించింది రోహిత్ సేన. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు, ఫీల్డర్లు సమష్టిగా రాణించడంతో అద్భుతమైన విజయం అందుకుంది. అయితే మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్షణం మాత్రం వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీసుకున్న బ్రేక్ అనే చెప్పాలి. దీనిపై తాజాగా స్పందించాడు భారత వన్డే సారథి రోహిత్ శర్మ. పంత్ నాటకం వెనుక అసలు నిజం ఏంటో అతడు బయటపెట్టాడు. ఇంతకీ హిట్‌మ్యాన్ ఏం అన్నాడంటే. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో అప్పటికి 30 బంతుల్లో 30 పరుగులు కావాలి. అప్పుడే చిన్న విరామం దొరికింది. పంత్ తన బుర్రను వాడి కాసేపు మ్యాచ్‌ను ఆపేశాడు. మోకాలి గాయం ఇబ్బంది పెడుతుండటంతో ట్రీట్‌మెంట్ తీసుకొని ఆడాడు. దీని వల్ల మ్యాచ్ కాస్త నెమ్మదించింది. అప్పటికి ఊపు మీదున్న ప్రొటీస్ బ్యాటర్ల రిథమ్ దెబ్బతింది. క్లాసెన్ గేమ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూశాడు. మ్యాచ్ షురూ అయ్యాక అతడు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విక్టరీ కొట్టాం. అయితే పంత్ చేసిన పని వల్లే గెలిచామని అనడం లేదు. కానీ అతడు బుర్ర వాడటం జట్టుకు చాలా మంచి చేసింది’ అని రోహిత్ బయటపెట్టాడు. మ్యాచ్‌ను స్లో చేయాలనే ఉద్దేశంతో కావాలనే పంత్ గాయం పేరుతో నాటకం ఆడాడని హిట్‌మ్యాన్ తెలిపాడు. ఈ బ్రేక్ వల్ల మూమెంటమ్ మొత్తం సౌతాఫ్రికా నుంచి టీమిండియా వైపు తిరిగిందన్నాడు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version