నెక్కొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నిక
అధ్యక్షుడిగా తాటిపల్లి శివకుమార్
ప్రధాన కార్యదర్శిగా భూపతి వీరన్న
నెక్కొండ నేటి ధాత్రి:
నెక్కొండ మండల ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులు పిఎసిఎస్ చైర్మన్ మారం రాము జిల్లా ఉపాధ్యక్షుడు గోరంట్ల వెంకటనారాయణ, జిల్లా కార్యదర్శి దేసూ లక్ష్మణ్, లసమక్షంలో ఎన్నికలు ప్రశాంతంగా ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికలను ఆర్యవైశ్య సీనియర్ నేతలు తాళ్లూరి వెంకటేశ్వర్లు, గన్ను సత్యం నంగునూరు శివయ్య, దొడ్డ విజయ్, తాళ్లూరు నరసింహ స్వామి, ల ఆధ్వర్యంలో జరగగ మండల కమిటీ అధ్యక్షుడిగా తాటిపల్లి శివకుమార్, నెక్కొండ, ఉపాధ్యక్షులు 1 వేంశెట్టి శ్రీహరి , పెద్ద కోరుపోలు, 2 మా శెట్టి యాదగిరి తోపనపల్లి, 3 కిరణ్ రెడ్లవాడ, ప్రధాన కార్యదర్శిగా భూపతి వీరన్న నెక్కొండ, సహాయ కార్యదర్శిగా బొల్లం యాకయ్య చిన్న కొరుపోలు, కోశాధికారిగా ఇమ్మడి శ్రీనివాస్ చంద్రుగొండ, మండల కార్యవర్గ సభ్యులుగా వేములపల్లి వీరన్న దీక్షకుంట, బెలిదే రమేష్ ముదిగొండ, సమ్మయ్య గుండ్లపల్లి, గాందే కృష్ణమూర్తి బంజారా పల్లి, చిదురాల నరేష్ అలంకానిపేట, గంప కుమారయ్యా నాగారం, వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు తాటిపల్లి శివకుమార్ కార్యదర్శి భూపతి వీరన్న మాట్లాడుతూ సంఘ అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని మాకు బాధ్యతలు అప్పగించడంలో సహాయ సహకారాలు అందించిన పి ఎస్ సి ఎస్ చైర్మన్ మారం రాము,తాలూరి నర్సింహులు, దొడ్డ విజయ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాపైన నమ్మకాన్ని ఉంచిన అందరి ఆశీస్సులతో కమ్యూనిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో గన్ను కృష్ణ, తాలూరి లక్ష్మయ్య,, గన్ను రాము, డిష్ రాజు, దొడ్డ నగేష్, నంగునూరు వెంకన్న, అశోక్ ,తాలూరి కృష్ణ, మోహన్, బొల్లం చందు, ఇమ్మడి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.