ముగిసిన పుర ఎన్నికలు…
ప్రశాంత వాతావరణం లో ముగిస్తున్న మున్సిపల్ ఎన్నికలు
ఎంతో ప్రాయాస పడుతూ ఓట్లలో పాల్గొన్న వికలాంగులు… వృద్ధులు
కేసముద్రం/ నేటి ధాత్రి
నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలో ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో ముగిసాయి ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపాలిటీ ఎన్నికలకు అన్ని పార్టీల నాయకులు సవ్యమనం పాటిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించారు. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా నూతనంగా ఏర్పాటు అవుతున్న మున్సిపాలిటీ ఎన్నికలలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు తమ ఓటు హక్కును అందరూ వినియోగించుకున్నట్టు కనబడుతుంది ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క ఓటరు కేసముద్ర మున్సిపాలిటీ అభివృద్ధి కొరకై తమ ఓటును వేసి మద్దతు తెలిపినట్టు వినపడుతుంది. ఎన్నికలు అయితే ముగిసాయి కానీ ఎవరికి పట్టం కడతారో అనేది అందరిలో ఉత్కంఠ రేపుతుంది. అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్ష పార్టీలో పోటాపోటీగా ఎన్నికలు జరిగినట్టు సమాచారం. కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికలలో ఎవరికి విజయం వరిస్తుందో ఎవరికి అపజయం వరిస్తుందో చెప్పలేని పరిస్థితి కనపడుతుందని పలువురు భావిస్తున్నారు. పలువురు నాయకులు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఎవరికి వారు ఎన్ని చెప్పుకున్నా ప్రజల తీర్పే తుది తీర్పు ఆ తీర్పు వెలుపడే సమయం ఒక్కరోజు కన్నుమూస్తే మర్నాడు ఎవరి జాతకాలు ఏంటనేది తేలిపోతుంది అప్పటిదాకా అభ్యర్థులకు నాయకులకు కంటిమీద కు నుకు పట్టిన ప్రజలు మాత్రం ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నట్టు కనపడుతుందని భావిస్తున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి ఓటర్ల నాడి ఎవరు ఊహించలేని విధంగా తీర్పు ఇచ్చేలా ఓటర్లు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయో ఎవరిని విజయం వరిస్తుందో ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడే శుక్రవారం 13వ తారీకు వరకు వేచి చూడాల్సిందే.
