నామినేషన్ కేంద్రాల పరిశీలన
బాలానగర్/నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, తిరుమలగిరి నామినేషన్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎస్పీ ధారావత్ జానకి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలలో సౌకర్యాలపై సిబ్బందితో కలిసి ఆరా తీశారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ భద్రతపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్సై లెనిన్ గౌడ్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్ రెడ్డి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
