ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు…

ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

మహాదేవపూర్ సెప్టెంబర్ 17 (నేటి ధాత్రి)

 

ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో భాగంగా బుధవారం రోజున మహాదేవపూర్ ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం వేడుకలలో భాగంగా ఎంపీడీవో రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ ప్రసాద్, ఏపీవో, సూపర్ ఇండెంట్, శ్రీధర్ బాబు కార్యాలయ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా ఇంజనీర్స్ డే…

ఎంపిడిఓ కార్యాలయంలో ఘనంగా ఇంజనీర్స్ డే

ఇంజనీర్ లను సన్మానించిన ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

 

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజనీర్స్ డే సందర్భంగా ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని మండలంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఏఈ నోముల శ్రీలత హౌసింగ్ ఏఈ పోకల ఆకాంక్షలను మండల పరిషత్ అబివృద్ది అధికారి పెద్ది ఆంజనేయులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా యంపీడీఓ ఆంజనేయులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ అంటే కేవలం చదువు మాత్రమే కాదని దేశ అభివృద్ధికి ఒక దిశ అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version