వెంకట్రావుపేట్ గ్రామం లో నట్టల నివారణ మందులు పంపిణి…

వెంకట్రావుపేట్ గ్రామం లో నట్టల నివారణ మందులు పంపిణి
మల్లాపూర్ నేటి ధాత్రి

మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో శుక్రవారం రోజున పశు వైద్యాధికారి డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో గొర్లకు మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు.ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ కనుముల వెంకటేష్,ఉప సర్పంచ్ తోట గంగా రెడ్డి, డా. ఇక్బాల్, గోపాలమిత్ర బదినపెళ్లి రవి,వార్డు సభ్యులు, యాదవ సంఘం సభ్యులు.తదితరులు పాల్గొన్నారు.

గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం

గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తేదీ 31-12-2025 నాడు గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం మండలంలోని వివిధ గ్రామాలలో విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో
•దేవరంపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీ పాట్లోల రవికుమార్ గారు మరియు గ్రామ పెద్దలు,
•ఈదులపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ పడమటి నాగేశ్వర్ గారు మరియు ఇతర గ్రామ పెద్దలు,
•మెదపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ కొల్లూరు నరేందర్ రెడ్డి గారు మరియు ఇతర గ్రామ పెద్దలు
పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ నట్టల నివారణ కార్యక్రమం ద్వారా నేటి రోజున
•మొత్తం 490 గొర్రెలకు,
•మొత్తం 850 మేకలకు
నట్టల నివారణ మందులు వేయడం జరిగింది.
ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు సిబ్బంది పశుపాలక రైతులకు నట్టల నివారణ కార్యక్రమం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడటం, ఉత్పాదకత పెరగడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
గ్రామాల పశుపాలక రైతులు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, మండల పశుసంవర్ధక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న జహీరాబాద్ నియోజకవర్గ రైతులు…

రైతుబంధు కోసం ఎదురుచూస్తున్న జహీరాబాద్ నియోజకవర్గ రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ ఝరాసంగం మొగుడంపల్లి నాల్కల్ జహీరాబాద్ మండల రైతులు రబీ సీజన్ పెట్టుబడి ఆర్థిక సహాయం రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారని మంగళవారం ఉదయం పలువురు రైతులు తెలిపారు. ఈ సహాయం అందజేయడంలో జాప్యం జరుగుతోందని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. త్వరగా రైతుబంధు అందజేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు…

కథలాపూర్ మండల కేంద్రంలో ఈరోజు గొర్రెలలో మరియు మేకలలో ఉచిత నట్టల నివారణ మందు

నేటి ధాత్రి కథలాపూర్

 

ఫెర్మాండజోల్ డ్రగ్ పంపిణి చేస్తూ నెల పైబడిన అన్ని జీవాలలో కథలాపూర్ గ్రామంలో మొత్తం 1660 జీవాలకు నట్టల నివారణకు మందు పంపిని చేయడం జరిగింది.
ఇ కార్యక్రమంలో సర్పంచ్ న్యావనంది శేఖర్ ఉప సర్పంచ్ చెట్పల్లి ప్రసాద్, తాలూకా మల్లేష్
డాక్టర్ దివ్యశ్రీ మేడం,
సిబ్బంది రాజకుమార్,రసూల్
మరియు గోర్లు మేకల పెంపకం దారులు పాల్గొన్నారు

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు…

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 మండలాలకు చెందిన 69,427 ఆవు జాతి పశువులకు 62,758 గేద జాతి పశువులకు మొత్తం 1,32,185 పశువులకు ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖఖ అధికారి డాక్టర్ కుమారస్వామి ఆసోడా తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న పశు వైద్య వైద్య అధికారులు పశు వైద్య సిబ్బందితో మంగళవారం రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి టీకాల కార్యక్రమం గురించి రివ్యూ చేయడం జరిగినది. టీకాలు వేసేందుకు గాను 22 బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 15వ తారీకు నుండి నవంబర్ 4వ తారీఖు వరకు మొత్తం 29258 తెల్లజాతి పశువులకు 34,902 నల్లజాతి పశువులకు మొత్తంగా 64,160 పశువులకు విజయవంతంగా గాలికుంటు టీకాలు వేయడం జరిగినది. దీనిలో భాగంగా 14387 రైతులు లబ్ధి పొందడం జరిగింది. రైతులకు పశుపోషకులకు మరొకసారి విన్నవించేది ఏమనగా మిగిలిన 10 రోజులలో అనగా నవంబర్ 15వ తారీకు వరకు జరిగే ఈ టీకాల ప్రోగ్రాంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది గ్రామాలకు వచ్చినప్పుడు వారికి సహకరించి మీకు సంబంధించిన అన్ని పశువులకు టీకాలు వేయించుకోవాలని అలాగే పశుపోషకులు ఈ కార్యక్రమంలో పూర్తిగా భాగస్వాగస్వామ్యం కావాలి. అలాగే ఈ గాలికుంటు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేయడం అయినది. జిల్లాలో పశుసంవర్ధక శాఖ మంత్రి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హాజరై ఈ కార్యక్రమంలో విజయవంతం చేయుచున్నందుకు పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కావున ఈ గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి సూచించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version