రాంపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం…

రాంపూర్ లో ఉచిత పశు వైద్య శిబిరం

నిజాంపేట: నేటి ధాత్రి

 

నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గురువారం గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్, జిల్లా పశు వైద్య గణనభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో పాడి పశువులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారి మణికుమార్ మాట్లాడుతూ.. గర్భ కోశ వ్యాధి నివారణ వ్యాధి టీకాలు రైతులు పశువులకు వేయించాలన్నారు. 90 రోజుల ఎద లక్షణాలను గుర్తించి గోపాల మిత్ర ద్వారా కృత్రిమ గర్భాదారణ చేయించుకోవాలని రైతులకు సూచించారు. 15 రోజుల తర్వాత ఆరు నెలల వరకు నట్ట నివారణ మందులు వాడాలన్నారు.

పశువైద్య ఇన్చార్జ్ అధికారిగా మణికుమార్..

పశువైద్య ఇన్చార్జ్ అధికారిగా మణికుమార్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

నిజాంపేట మండల పశువైద్య ఇన్చార్జ్ అధికారిగా మణికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతం లో కామారెడ్డి జిల్లా, మద్నూర్ మండలం లో పని చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం డిప్యూటేషన్ పై నిజాంపేట మండలానికి ఇంచార్జ్ గా వచ్చినట్లు చెప్పారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం

గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తేదీ 31-12-2025 నాడు గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం మండలంలోని వివిధ గ్రామాలలో విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో
•దేవరంపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీ పాట్లోల రవికుమార్ గారు మరియు గ్రామ పెద్దలు,
•ఈదులపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ పడమటి నాగేశ్వర్ గారు మరియు ఇతర గ్రామ పెద్దలు,
•మెదపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ కొల్లూరు నరేందర్ రెడ్డి గారు మరియు ఇతర గ్రామ పెద్దలు
పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ నట్టల నివారణ కార్యక్రమం ద్వారా నేటి రోజున
•మొత్తం 490 గొర్రెలకు,
•మొత్తం 850 మేకలకు
నట్టల నివారణ మందులు వేయడం జరిగింది.
ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు సిబ్బంది పశుపాలక రైతులకు నట్టల నివారణ కార్యక్రమం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడటం, ఉత్పాదకత పెరగడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
గ్రామాల పశుపాలక రైతులు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, మండల పశుసంవర్ధక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

గొర్రెల మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలి.

గొర్రెల మేకల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలి.

చిట్యాల, నేటిదాత్రి :

 

మంగళ వారం రోజున చిట్యాల మండలo లోని గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ మందులు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథు గా గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి – అంతులు , ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ పాల్గొని ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఇట్టి నట్టల నివారణ కార్యక్రమాన్ని* చిట్యాల్ మండల గొర్రెల మరియు మేకల పెంపకం దారులు*సద్వినియోగం చేసుకోవాలని అన్నారు, అలాగే చిట్యాల ప్రాంతీయ* పశువైద్య శాల అసిస్టెంట్ డైరెక్టర్ జి వెంకన్న మాట్లాడుతూ నట్టల* నివారణ మందులు త్రాగిపించుకోవడం వలన గొర్రెలు మరియు మేకల లో నత్తలు నుంచి జీవాలు రక్షణ తో పాటు ఆరోగ్యముగా, అధిక బరువు పెరగడం జరుగుతుంది అని అన్నారు,, మండల పశు వైద్య అధికారి అజయ్ అప్పని, మాట్లాడుతూ చిట్యాల* మండలం లోని దాదాపు 2000 జీవాలకు నట్టల మందు ఇవ్వడం జరిగినది అని తెలిపారు అలాగే మండలం*లోని అన్ని గ్రామాలలోని గొర్రెల మరియు మేకల పెంపకం దారులు ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా* సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల* సర్పంచ్ తౌటం లక్ష్మి- అంతులు , ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ లతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జి వెంకన్న, వెటర్నరీ సర్జన్ డాక్టర్ అజయ్ అప్పని లతో పాటు పశు వైద్య సహాయ సిబ్బంది కవిత , దివ్య , కరుణాకర్ , రాజేందర్ రెడ్డి* మరియు గొర్రెలు మరియు మేకల పెంపకం దారులు పాల్గొన్నారు.

కోహిర్ లో కుక్కలకు వింత రోగం..

కోహిర్ లో కుక్కలకు వింత రోగం

◆-: గ్రామాల్లో భయం భయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కోహిర్ మండలంలోని పలు గ్రామాలలో బిలాల్పూర్, మనియార్పల్లి, దిగ్వాల్, సజ్జపూర్, బడంపేట్ తదితర గ్రామాల్లో వీధి కుక్కలు అనా రోగ్యానికి గురవుతూ బక్కచిక్కి అంద వికారంగా మారిపోతు న్నాయి. ఏదో తెలియని వైరస్ బారిన పడినట్టు కనిపిస్తున్న ఈ కుక్కలు వెంట్రుకలు రాలిపోయి, బలహీనంగా కదులుతూ గ్రామస్థు లను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గ్రామాల్లో ఈ వైరస్ వ్యాప్తి, పురుగులు పడటం వంటి సమస్యలు కలకలం రేపుతు న్నాయి. ముఖ్యంగా వీధి కుక్కల నుంచి మనుషులకు ఏదైనా అంటు వ్యాధి సోకుతుందేమోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. పిల్లలు, వృద్ధులు బయటికి వెళ్లడానికి కూడా జంకుతున్నారు. ఈ సమస్యపై స్థానికంగా జంతు వైద్యులు జోక్యం చేసుకుని చికిత్స అందించాలని, వ్యాధి కారణాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు ఈ గ్రామాల్లో సర్వే నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీ వల తెలంగాణలో వీధి కుక్కల సమస్య పెరిగిపోతుండటంతో, ఈ కొత్త వైరస్ ఆందోళన మరింత పెంచింది. అధికారులు త్వరగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version