ఏసీబీకి పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి
అవినీతిపరులను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటే ఏసీబీ శాఖను అవమానపరిచినట్లే
ఎన్ హెచ్ ఆర్ సి. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బూర్ల వంశీ
పెద్దపల్లి టౌన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కు పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం తొలగించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బూర్ల వంశీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏసీబీ నిర్వహించే దాడులలో లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారు ఎలా సుద్ధపూసలు అవుతారని, అసలు వారు నిర్దోషులు ఎలా అవుతారని ఆయన అన్నారు. కోర్టులలో నిర్దోషులమని క్లీన్ చీట్ తెచ్చుకొని మళ్లీ వారు ఉద్యోగంలోకి వస్తే ఇంకా వారి ఆగడాలకు హద్దు, అదుపు ఉండదని ఆయన అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ను అవమానపరిచినట్లేనని ఆయన అన్నారు. ఏసీబీకి చిక్కిన కూడా కోర్టుల ద్వారా మళ్లీ ఉద్యోగంలోకి రావచ్చుననే అభిప్రాయం ఇప్పటికే ఉందని కాబట్టి పూర్తి ఆధారాలతో పట్టుబడ్డ వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. లేనట్లయితే ఏసీబీ పట్ల ఎవరికి భయం, భక్తి ఉండవని ఆ శాఖను ఎవరూ పట్టించుకోరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి అక్రమార్కులపై చర్యలు తీసుకునే విషయంలో ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని వారు తీసుకునే నిర్ణయాన్ని న్యాయస్థానాలు, ప్రభుత్వాలు గౌరవించాలని ఆయన కోరారు. ఏసీబీకి చిక్కిన అవినీతి అక్రమార్కుల విషయంలో చట్టాలను కఠినతరం చేయాలని, దోషులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించి, వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా గౌరవ కోర్టులు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రతి రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో ఎసిబి కోర్టులను ఏర్పాటు చేయాలని, ప్రజాధనం కాపాడడానికి ఏసీబీకి సమాచారం అందించిన వారిని దేశభక్తులుగా పరిగణించాలని, వారికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త కమలాకర్, నాయకులు రాజ్యలక్ష్మి, నంబయ్య, సదయ్య తదితరులు పాల్గొన్నారు.