భారత అణుశక్తి మిషన్ పురోగతిపై వివరాలు కోరిన..

భారత అణుశక్తి మిషన్ పురోగతిపై వివరాలు కోరిన..

*తిరుపతి ఎంపి గురుమూర్తి..

తిరుపతి(నేటి ధాత్రి)అగస్టు
20:

 

 

చిన్న అణు రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ముఖ్యమైన సమాచారాన్ని కోరారు. 2025-26 బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లతో ప్రకటించిన అణుశక్తి కార్యక్రమం ప్రస్తుత స్థితి, అలాగే తిరుపతి జిల్లాలోని ప్రముఖ విద్యా సంస్థలను ఈ పరిశోధనలో భాగం చేసే ఆలోచన ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రాంతాలవారీగా భాగస్వామ్యం, అలాగే 2033 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసే చిన్న అణు రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించే అవకాశం ఉందా అనే విషయాలను కూడా ఆయన అడిగారు.
ఈ ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానం ఇస్తూ కేంద్ర బడ్జెట్ 2025లో అణుశక్తి కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద, చిన్న అణు రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్లు కేటాయించారని చెప్పారు. ఈ రియాక్టర్లు పర్యావరణ అనుకూల ఇంధన వనరుల కోసం దేశం యొక్క ప్రయత్నాలకు ఊతమిస్తాయని పేర్కొన్నారు.

భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్మాల్ మాడ్యులార్ రియాక్టర్ల అభివృద్ధి బాధ్యతలను చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం, ఇక్కడ ప్రస్తుతం మూడు రకాల స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లను అభివృద్ధి చేస్తూన్నారని తెలియజేసారుపాత థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ల స్థానంలో, అధిక విద్యుత్ వినియోగ పరిశ్రమలకు విద్యుత్ అందించడానికి భారత్ స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లు (బిఎంఎస్ఆర్-200), మారుమూల ప్రాంతాలకు, గ్రిడ్ సౌకర్యం లేని ప్రదేశాలకు విద్యుత్ అందించడానికి స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్-55), రవాణా, పరిశ్రమల రంగాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి 5 మెగావాట్ థర్మల్ సామర్థ్యం గల హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్లను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ రియాక్టర్ల తొలి యూనిట్లను అణుశక్తి విభాగం స్థలాల్లో ఆ తర్వాత పాత విద్యుత్ కేంద్రాల వద్ద లేదా పరిశ్రమల దగ్గర నిర్మిస్తారని మంత్రి తెలిపారు. విశాఖపట్నంలో బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఒక కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందని తెలియజేసారుఈ రియాక్టర్ల కోసం స్థలాలను ఒక ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుందని,
ఈ రియాక్టర్ల నిర్మాణం, పరికరాల సరఫరా, ఇతర కార్యకలాపాల కోసం అవసరమైన ఏజెన్సీలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలను బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారని తెలియజేసారు.

జల్ జీవన్ మిషన్ అమలు

*తిరుపతి జిల్లాలో తాగునీటి సరఫరాపై

తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న.

తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 14:

లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖా సహాయ మంత్రి వి.సోమన్న సమాధానం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్‌లను అందించడమే లక్ష్యంగా 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంబించారని తెలిపారు.ఈ కార్యక్రమం ప్రారంభ సమయానికి తిరుపతి జిల్లాలో కేవలం 2.40 లక్షల గ్రామీణ ఇళ్లకు (57.58%) త్రాగు నీటి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. అయితే,గత అయిదేళ్లలో 1.76 లక్షల కొత్త కనెక్షన్లు అందించారని, ప్రస్తుతం 4.16 లక్షల ఇళ్లకు (99.82%) తాగునీటి కనెక్షన్లు అందించబడ్డాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారీగా చూసినట్లయితే 1.19 లక్షల ఎస్సీ, 26 వేల ఎస్టీ కుటుంబాలకి త్రాగునీటి కనెక్షన్లు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఓబిసిలకి సంబందించిన సమాచారం అందుబాటులో లేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో కనెక్షన్ల కవరేజ్ గరించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం తిరుపతి జిల్లాలో మొత్తం 4,018 హ్యాబిటేషన్లు ఉండగా వాటిలో 487 ఎస్టీ,1,331 ఎస్సీ హ్యాబిటేషన్ గా గుర్తించబడ్డాయని పేర్కొన్నారు. వీటిలో 09.02.2025 నాటికి 485 ‘ఎస్టీ, మరియు1,328 ‘ఎస్సీ హ్యాబిటేషన్లు పూర్తి స్థాయిలో కనెక్షన్ లు అందించా
బడ్డాయని తెలిపారు.అలాగే తాగునీటి నిర్వహణలో గ్రామస్థాయి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల ఏర్పాటు ప్రోత్సహిస్తున్నామని తెలియజేశారు. తిరుపతి జిల్లాలోని 908 గ్రామాలలో 901 గ్రామాలకు గ్రామ నీటి,పారిశుద్ధ్య కమిటీ ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు. ఇందులో 50% కమిటీ సభ్యులు మహిళలు కావడం గమనార్హమని అన్నారు.ఈ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాధాన్యం కల్పించామనీ తెలిపారు.
ఈ పథకం ప్రారంబించే సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో 30.74 లక్షల (32.18%) గ్రామీణ ఇళ్లకు మాత్రమే తాగునీటి కనెక్షన్లు అందుబాటులో ఉండగా, 2025 ఫిబ్రవరి 9 నాటికి ఈ సంఖ్య 70.46 లక్షల (73.76%)కు చేరిందని పేర్కొన్నారు. ప్రతి గ్రామీణ ఇంటికి 55 లీటర్ల తాగునీరు రోజుకు అందించే లక్ష్యం కోసం జల్ జీవన్ మిషన్ వేగంగా పురోగమిస్తోందని ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక & సాంకేతిక సహాయం అందిస్తూనే ఉందని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version