గిన్నియర్ పల్లిలో నీటి కష్టాలు.. అధికారులు నిర్లక్ష్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల గిన్నియర్ పల్లి గ్రామంలో వర్షాకాలంలో కూడా తీవ్ర నీటి కొరత నెలకొంది. బోర్లు పనిచేయకపోయినా, భగీరథ నీటి సరఫరా నెలలో కనీసం రెండుసార్లు కూడా సరిగా రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి సరఫరా ఆగిపోవడానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులే కారణమని అధికారులు చెబుతున్నారని, సమస్యపై ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.