ప్రభుత్వ పాఠశాల డయాస్ ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి…

ప్రభుత్వ పాఠశాల డయాస్ ను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

మాజీ ఉపసర్పంచ్ రామగుండం రాజకుమార్

వీణవంక, నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో సర్పంచ్ వ్యవహారంపై తీవ్ర వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ రాజకుమార్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, జిల్లా కలెక్టర్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
వారి ఆరోపణల ప్రకారం గ్రామంలో సుమారు రూ.10 లక్షల విలువ కలిగిన ప్రభుత్వ పాఠశాలలో డయాస్ (వేదిక) ను ఎలాంటి అనుమతులు లేకుండా కూల్చివేయడం జరిగింది. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన ఈ ఆస్తులను ధ్వంసం చేయడం పూర్తిగా ప్రజా నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కూల్చివేతలో
సంబంధిత అధికారుల నుండి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం అనుమతి తీసుకోకుండా
గ్రామ సభ తీర్మానం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు
ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, గ్రామ ప్రజల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని వారు తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ రాజకుమార్ మాట్లాడుతూ,
“ప్రజల డబ్బుతో నిర్మించిన ఆస్తులను అన్యాయంగా కూల్చివేయడం గ్రామ అభివృద్ధికి పెద్ద దెబ్బ బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే బీఆర్‌ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం” అని హెచ్చరించారు.
కలెక్టర్ సమర్పించిన ఫిర్యాదులో బీఆర్‌ఎస్ నాయకులు
ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని
చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని
ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులను పునరుద్ధరించాలని
గ్రామ పాలనలో పారదర్శకతను నిర్ధారించాలని
డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై గ్రామ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య ప్రక్రియలను పక్కనబెట్టి తీసుకున్న నిర్ణయాలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఈదునూరి భూమయ్య, నల్లగాశ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ఆవాల అరుంధతి- గిరిబాబు,మేడుదుల రాజు తదితరులు పాల్గొన్నారు.

అక్షర స్కూల్ లో జేరిగిన సంఘటనపై జిల్లా మంత్రి ఎమ్మెల్యే స్పందించ లేదు

అక్షర స్కూల్ లో జేరిగిన సంఘటనపై జిల్లా మంత్రి ఎమ్మెల్యే స్పందించ లేదు

రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతీయాజ్ ఇసాక్

వనపర్తి నేటిదాత్రి .

 

అక్షర స్కూల్ జరిగిన పై అధికార పార్టీ మాజీ కౌన్సిలర్ బేర సారాలు కుదరక పోవడంతో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలేదని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా స్కూల్ లో జేరిగిన సంఘటన గురించి ఎమ్మెల్యే రెస్పాన్స్ కాలేదని స్కూల్ యజమాన్యాన్ని కాపాడడానికి ఎమ్మెల్యే టిఆర్ఎస్ నేతలపై స్కూల్ యాజమాన్యంతో ఫిర్యాదు చేయించారని చెప్పారు ఇంత సంఘటన జరిగితే కూడా పోలీస్ అధికారులు కనీసం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి జరిగిన సంఘటన గురించి విలేకరులకు తెలుపలేదని ఆవేదన వ్యక్తం చేశారు మైనారిటీ ప్రజల ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ముస్లిం మైనారిటీలు హిందువుల పండుగలు కలిసి ఐకమత్యంగా జరుపుకుంటారని అన్నారు నాలుగు రోజుల తర్వాత అక్షర స్కూల్లో జరిగిన సంఘటన బయటకు వచ్చిందని అన్నారు వనపర్తి లో రాజకీయాలకతీతంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు సంఘాలు ఐక్యతతో అక్షర స్కూల్ అనుమతులు రద్దు చేయించాలని పిలుపునిచ్చారు అక్షర స్కూల్ సంఘటనపై జిల్లా మంత్రి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి స్పందించలేదని కనీసం జరిగిన సంఘటనపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయలేదని అన్నారు అక్షర స్కూల్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ రద్దు చేయుటకు విద్యాశాఖ ఉన్నతాధికారులకు హైదరాబాదులో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి టిఆర్ఎస్ నేతల మైనారిటీల సహకారంతో ఫిర్యాదు చేస్తామని చెప్పారు ఇటువంటి స్కూల్లో తమ పిల్లలను అడ్మిషన్లు చేయవద్దని వనపర్తి ప్రజలను కోరారు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో మైనారిటీలకు 102 గల్స్ కళాశాలలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు అక్షర స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయుటకు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి విద్యాశాఖ అధికారులకు లెటర్ రాయాలని ఆయన డిమాండ్ చేశారు వనపర్తి నియోజకవర్గం లో ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే గెలిచారని పదవులు శాశ్వతం కాద విలువలు ముఖ్యమని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా టిఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మైనారిటీ నేతలు అమర్ రహిమాన్ జోహెబ్ హుస్సేన్ సయ్యద్ జెమీల్ ఇమ్రాన్ వాజీద్ ఇంతీయా
జ్ పేపర్ బాయ్ షేక్ బిక్కన్ బీ ఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version