దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి…

దారి లేదని వెళ్ళనివ్వడం లేదు న్యాయం చేయండి

– కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

హనుమకొండ:నేటిధాత్రి

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న తమ భూమిలోకి బాట లేదని వెళ్లనివ్వకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన బొక్క తిరుపతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు . తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 133 ఏ, 133 బి, 148b2, 148సి/1/1/3 సర్వే నెంబర్లలో మొత్తం మూడు ఎకరాల రెండు గుంటల భూమి ఉండగా గత 45 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నామని కానీ గత కొంతకాలంగా తమ భూమి లోకి వెళ్లకుండా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తోకల మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారని అన్నారు. ఇదే విషయంపై గతంలోనే జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయగా ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్ కు రిఫర్ చేసిందని దానితో స్థానిక ఆర్డిఓ తహసిల్దార్ విచారణ చేసి గతంలో లాగానే వ్యవసాయ పనుల నిమిత్తం మోహన్ రెడ్డి భూమి నుండి తమ భూమి లోకి వెళ్లే విధంగా తీర్పు ఇచ్చారని దానికి మోహన్ రెడ్డి సైతం ఒప్పుకున్నాడని అన్నారు. ఆ తర్వాత మళ్లీ అదే విధంగా ప్రవర్తిస్తూ వ్యవసాయ పనులకు తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని అన్నారు. గతంలో తమను తీవ్రంగా కులం పేరుతో దూషించడంతో పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని దానిని ఇప్పుడు ఉపసంహరించుకోమని తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు.దీని పూర్తి వివరాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

మీసేవ కేంద్రాల దోపిడి నుండి కాపాడండి…

మీసేవ కేంద్రాల దోపిడి నుండి కాపాడండి

సింగరేణి విశ్రాంత ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లోని మీ సేవ కేంద్రాల యాజమాన్యాల దోపిడి నుండి వేలాది మంది సింగరేణి విశ్రాంత ఉద్యోగులను కాపాడాలని కలెక్టర్ కి సోమవారం విజ్ఞప్తి చేశారు.ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో విశ్రాంత సింగరేణి ఉద్యోగులు పెన్షన్ దారులు జిల్లాలోని మీ సేవ కేంద్రాలలో జీవన్ ప్రమాణ్,డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ తీసుకుంటేనే సింగరేణి పెన్షన్ దారులకు ప్రతి నెల వారి వారి బ్యాంకు ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ అవుతాయని తెలిపారు.సింగరేణి విశ్రాంత ఉద్యోగుల అవసరాన్ని ఆసరా చేసుకొని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు వారికి ఇష్టం వచ్చిన విధంగా,ఇష్టరిత్య ఒక్కొక్క మీ సేవా కేంద్రాల ఎజమానులు ఒక్కో పెన్షన్ దారు నుండి 200,150,100 రూపాయిల వరకు తీసుకుంటూ చదువురాని సింగరేణి విశ్రాంత పెన్షన్ దారులను దోపిడీకి గురి చేస్తున్నారని వాపోయారు.ఒక కోల్ మైన్స్ పెన్షన్ కు 50 రూపాయిలు సిపిఎంఆర్ఎస్ ఉద్యోగి వారి జీవిత భాగస్వామికి సంబంధించిన మెడికల్ హెల్త్ కార్డు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ కు 75 రూపాయిలు తీసుకునే విధంగా జిల్లాలోని మీ సేవ కేంద్రాల యజమానులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ని కోరారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, జిల్లా నాయకులు ఏ.గంగయ్య ,బియ్యాల ప్రభాకర్ రావు ,జెడి బీరయ్య, సిహెచ్.వైకుంఠం,కె.రాజిరెడ్డి, డి.సాయిలు,కస్తూరి సూర్యం తదితరులు పాల్గొన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version