గాలివాన ధాటికి కూలిన విద్యుత్ స్తంభాలు.. విద్యుత్ సరఫరా నిలిపివేత….
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చనిగేపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలుల కారణంగా పలు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో కూలిన స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసే పనులు మంగళవారం చేపట్టారు. గ్రామస్థుల సహకారంతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. త్వరలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు.
