మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

#తహసిల్దార్ ముప్పు కృష్ణ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తో పాటు తీవ్రమైన గాలులు విస్తాయని వాతావరణ శాఖ జారీచేసిన నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ ముప్పు కృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మొ o థ తుఫాన్ కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళవద్దని. అలాగే కరెంటు స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా ఉండాలని. మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకొని నడవాలని ఉధృతంగా ప్రవహించే చెరువులు వాగుల వద్దకు వెళ్లకూడదని అదేవిధంగా పాత గోడలు, ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉన్న వాటిలో వెంటనే ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతంలో ఉండాలని. వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే క్రమంలో విష సర్పాలతో జాగ్రత్తగా ఉండాలని . ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలను బయటకి పంపరాదు అని ఆయన మండల ప్రజలకు సూచించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల,నేటిధాత్రి

 

ఈ రోజు,రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లోద్దని,అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు.ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని,విద్యుత్,త్రాగునీర,అంతరాయం కలగకుండా చూడాలని,రోడ్లు,చెరువులు మరియు కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మత్తులు చేయాలని,అలాగే శిథిలావస్థ ఇళ్ళు,భవనాలలో ఉన్నవారిని అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి చూసించారు.అవసరం అయితే వారిని పునరావస్థ కేంద్రాలు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version